Posted on 2026-04-21 19:53:11
డైలీ భారత్, తెలంగాణ డెస్క్: ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా, జనగణన 2027లో భాగంగా స్వీయ ఎన్యూమరేషన్ (Self Enumeration - SE) సౌకర్యం 26-ఏప్రిల్-2026 నుండి ప్రారంభమవుతుంది. ఈ సౌకర్యం ద్వారా ప్రతి కుటుంబం తమ గృహ వివరాలను స్వయంగా ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం కల్పించబడింది. ఈ ప్రక్రియ 10-మే -2026 వరకు కొనసాగుతుంది. అందువల్ల ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వచ్ఛందంగా స్వీయ ఎన్యూమరేషన్లో పాల్గొనవలసిందిగా మనవి చేయడమైనది.
స్వీయ ఎన్యూమరేషన్ ద్వారా:
-సమయం ఆదా అవుతుంది
-సమాచారం ఖచ్చితంగా నమోదు చేయబడుతుంది
-జనగణన ప్రక్రియ వేగవంతంగా పూర్తి అవుతుంది
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, యువత, మహిళా సంఘాలు, స్వయం సహాయక సంఘాలు, బ్యాంకు మరియు ఐటీ రంగ ఉద్యోగులు, పట్టణ నివాస సంఘాలు తదితరులు ముందుండి పాల్గొని ఇతరులను కూడా ప్రోత్సహించవలసిందిగా కోరడమైనది. ప్రజలు అందరూ https://se.census.gov.in/ నిర్దేశిత వెబ్ పోర్టల్ను సందర్శించి తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. అవసరమైన సహాయం కోసం కార్యాలయమును సంప్రదించవచ్చు.
జనగణన దేశ అభివృద్ధికి అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. కాబట్టి ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకుని స్వీయ ఎన్యూమరేషన్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరడమైనది.
జూదం జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది – అక్రమ పేకాటపై పోలీసుల ఉక్కుపాదం
Posted On 2026-04-21 19:56:02
Readmore >
జనగణన 2027 – స్వీయ ఎన్యూమరేషన్ లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనండి
Posted On 2026-04-21 19:53:11
Readmore >
సంతలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-04-21 18:31:56
Readmore >
బాధ్యతాయుతంగా జనగణన పూర్తి చేయాలి : సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
Posted On 2026-04-21 17:08:06
Readmore >
హాష్ ఆయిల్ స్మగ్లింగ్కు పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠా అరెస్టు...కోట్ల విలువ గల హషీష్ ఆయిల్ స్వాధీనం
Posted On 2026-04-21 16:28:14
Readmore >