Posted on 2026-04-22 10:42:24
డైలీ భారత్, కరీంనగర్: కరీంనగర్లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేటు డ్రైవర్తో నడిపిస్తున్న అద్దె బస్సు లారీని ఢీకొట్టింది. కరీంనగర్లోకి కోతిరాంపూర్ బైపాస్ వద్ద బస్సు అదుపు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదంలో ఆర్టీసీ బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. కాగా, శిక్షణ లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తుండటం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగనప్పటికీ, పలువురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అనుభవం లేని డ్రైవర్లకు బస్సులు ఇస్తే మా ప్రాణాలు ఏమి అవ్వాలని ప్రయాణికులు అధికారులను ప్రశ్నిస్తున్నారు
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >