Posted on 2026-04-23 18:39:41
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్లో సగర భగీరథ జయంతి ఉత్సవాల సందర్భంగా శంకు బాబా అనుదీప్ ఆయన మాట్లాడుతూ సగర భగీరథుడు తన అచంచల తపస్సు సంకల్పబలం ద్వారా గంగాను భూమికి తీసుకువచ్చి ప్రజల జీవన విధానాన్ని మార్చిన మహనీయుడని చూపిన మార్గం నేటి తరానికి మార్గదర్శకమని సమాజ అభివృద్ధి కోసం కృషి చేయాలనే స్పూర్తిని అందిస్తుందని తెలిపారు.
మాజీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సగర భగీరథ జయంతిని అధికారిక ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించేందుకు ప్రారంభించడం మహనీయుడి గొప్పతనాన్ని ప్రజలకు గుర్తుచేశారు. రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన తాగునీటి పథకానికి “మిషన్ భగీరథ” అనే పేరు పెట్టడం కూడా భగీరథుని సేవలను స్మరించుకునే గొప్ప నిర్ణయమని సగర సమాజ అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని, ఈ సమాజానికి 20 లక్షల రూపాయల వరకు నామినేటెడ్ పనులను ఈఎండీ లేకుండా కేటాయించడం అలాగే హైదరాబాద్ కొకాపేట్ ప్రాంతంలో సగర సమాజానికి భూములు కేటాయించడం వంటి చర్యలు సమాజ పురోగతికి దోహదపడ్డాయని అన్నారు.
ప్రజల సంక్షేమం కోసం పట్టుదలతో పని చేయడం సహజ వనరులను సంరక్షించడం నీటి వనరుల అభివృద్ధి వంటి అంశాల్లో భగీరథుని ఆదర్శాలను అవసరమని తెలిపారు. సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
నిర్వాహకులను అభినందిస్తూ జయంతి ఉత్సవాలు మన సంస్కృతి సంప్రదాయాలను నిలబెట్టేలా నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు యువకులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >