| Daily భారత్
Logo




వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం

News

Posted on 2026-04-24 11:24:14

Share: Share


వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం

ఇల్లాలు.. ప్రియుడు.. ఓ రౌడీషీటరు

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం పన్నింది.

డైలీ భారత్, ప్రొద్దుటూరు : వివాహేతర సంబంధానికి అడొస్తున్నాడే కారణంతో భర్తను అంతమొందించేందుకు ఓ భార్య పన్నాగం పన్నింది. ప్రియుడు, మరో రౌడీషీటర్తో కలిసి కిరాతకంగా హతమార్చాలని కుట్ర పన్నింది. చివరికి పోలీసులకు చిక్కడంతో బెడిసికొట్టి అసలు విషయాలు వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన మేరకు ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

సుపారీ కోసం ప్రియుడికి బంగారమిచ్చిన భార్య..

పరిచయం.. ఆపై వివాహేతరం: ప్రొద్దుటూరు మండలం లింగాపురం చెందిన ఈశ్వర్రెడ్డి, శిల్పారెడ్డి దంపతులు. వీరికి పదిహేళ్ల క్రితం వివాహమైంది.

కొన్నిరోజులుగా వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఈ క్రమంలో శిల్పారెడ్డికి ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో పనిచేస్తున్న జమ్మలమడుగుకు చెందిన దాసరిగాళ్ల నాగసుధీర్(వివాహితుడు) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. అదికాస్తా వివాహేతర సంబంధంగా మారింది. విషయం భర్త ఈశ్వర్రెడ్డికి తెలియడంతో భార్యను పలుమార్లు మందలించారు. దీంతో తమ సంబంధానికి అడ్డుగా ఉన్న అతన్ని తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ప్రియుడు నాగసుధీర్ కూడా అందుకు ఒప్పుకొన్నాడు. రాజుపాళేనికి చెందిన రౌడీషీటర్ వినయ్కు విషయాన్ని తెలిపాడు. అతని ద్వారా సత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన కిరాయి ముఠాకు రూ. 10 లక్షలు సుపారీ ఇచ్చి ఈశ్వర్రెడ్డి హత్యకు ప్రణాళికలు రూపొందించారు

నగదుకు 14 తులాల బంగారం అమ్మకం: 

సుపారీకి అవసరమైన నగదు సమకూర్చేందుకు శిల్పారెడ్డి దాదాపు 14 తులాల బంగారాన్ని ప్రియుడికి ఇచ్చింది. నాగసుధీర్ ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాల్లోని పలు దుకాణాల్లో కొంత విక్రయించి, మరికొంత కుదువ పెట్టి డబ్బు తీసుకున్నాడు. అందులో దాదాపు రూ. 5 లక్షల వరకు కిరాయి ముఠాకు సుపారీ ఇచ్చాడు. మిగిలిన మొత్తం పనిపూర్తయిన తర్వాత ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు

తప్పించుకోవడంతో పన్నాగం విఫలం: 

కిరాయి ముఠా ప్రొద్దుటూరుకు చేరుకుని హత్యకు ప్రయత్నం చేసింది. ఈశ్వర్రెడ్డి ఎక్కడున్నారు.. ఏ మార్గంలో వెళ్తున్నారు అనే కదలికలన్నింటినీ భార్య శిల్పారెడ్డి ఎప్పటికప్పుడు ప్రియుడికి సమాచారం అందించేది. దీంతో ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా బలంగా ఢీకొట్టి కిందపడిపోయిన తర్వాత కత్తులతో పొడిచి హతమార్చాలని పథకం రచించారు. విఫలమైతే మరోసారి పొలం వద్ద నరికి చంపాలని ప్రణాళిక వేశారు. ఇందులో భాగంగా ప్రొద్దుటూరు బైపాస్ రోడ్డులో ఈశ్వర్రెడ్డి బైక్లో వెళ్తుండగా బుధవారం కారుతో ఢీకొట్టారు. అంతటితో ఆగకుండా కత్తులతో చంపే ప్రయత్నం చేశారు. బాధితుడు తప్పించుకుని పోలీసులను ఆశ్రయించారు. అతని ఫిర్యాదుతో శిల్పారెడ్డి, నాగసుధీర్తో పాటు మరికొందరిపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >