| Daily భారత్
Logo




నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ఎనిమిది వ్యక్తులు అరెస్టు

News

Posted on 2026-05-04 18:00:43

Share: Share


నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ఎనిమిది వ్యక్తులు అరెస్టు

డైలీ భారత్, వరంగల్: నకిలీ నోట్లను తయారుచేసి (ప్రింట్ తీసి) మార్కెట్లో చలామణి చేస్తున్న ముగ్గురు వ్యక్తులను మరియు తెలంగాణలో తక్కువ డబ్బులకు, ఎక్కువ డబ్బులను 1:3లో తయారుచేసి ఇస్తామని చెప్పి కోరిన వారికి రూపాయలు 500 నోట్ల పరిమాణంలో నల్ల కాగితలను ఇస్తూ మోసాగిస్తున్న ఐదుగురు వ్యక్తులను వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ మరియు నర్సంపేట పోలీసులు సంయుక్తంగా కలిసి అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుల నుండి నకిలీ నోట్లను, అసలు 1,48,000 రూపాయలను మరియు సుమారు 28 లక్షల విలువగల ల్యాప్ టాప్ లు, ప్రింటర్స్, 13 సెల్‌ఫోన్లు మరియు రెండు కార్లులను స్వాధీన పరుచుకున్నారు. 

పోలీసులు అరెస్టు చేసిన నిందితులు: 1) శాగంటి కిరణ్, నివాసం: నర్సంపేట; 2) నీరటి శివ, నివాసం: నర్సంపేట మరియు 3) నీరటి రంజిత్, నివాసం: నర్సంపేట, 4) గుడికందుల రవి, నివాసం: నర్సంపేట; 5) పోరిక రాజ్‌కుమార్ @ రాజు, నివాసం: ఘన్ పూర్ (ములుగు), 6) తనమాల రాజశేఖర్, నివాసం: వేంసూరు, ఖమ్మం; 7) ముదురుకోల యాకంబరం, నివాసం: తాతానగర్, భువనగిరి; 8) చేను సాయికిరణ్, నివాసం: కారకగూడెం(మండలం), కొత్తగూడెం కు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

ఈ అరెస్టుకు సంబంధించి ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ వివరాలను వెల్లడిస్తూ, నర్సంపేటకు చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగ వారు అసలు 100 రూపాయలు నోట్లను ల్యాప్ టాప్ మరియు ప్రింటర్ ద్వారా కలర్ ప్రింట్ తీసి మార్కెట్లో అసలు నోట్లుగా చలామణి చేస్తున్నారని మరియు మిగిలిన ఐదుగురు వ్యక్తులను విచారించగ వారు తెలంగాణ రాష్ట్రంలో తక్కువ డబ్బులకు, ఎక్కువ డబ్బులను 1:3 లో తయారుచేసి ఇస్తామని చెప్పి వారు బాధితులను నమ్మించడానికి, అసలైన 500 రూపాయల కరెన్సీ నోట్లను అయోడిన్ టింక్చర్ ద్రావణంలో ముంచడం ద్వారా వాటిని నల్లగా మార్చి, ఆపై "హైపో" (సోడియం థయోసల్ఫేట్) ద్రావణంలో ముంచగ, రసాయన చర్య ఫలితంగా వాటి అసలు రూపాన్ని తిరిగి వచ్చేలా చేసి, వారి ప్రణాళిక ప్రకారం, వారు నల్లటి రంగు కాగితాలను కట్టలుగా కట్టి, కోరినవారికి ఇచ్చి, వారు పైన చెప్పిన విదంగా చేసినట్లయితే, అవి అసలు నోట్లలాగా మారుతాయని నమ్మించి, వారి వద్ద నుండి అసలు నోట్లు తీసుకొని పరారు అవుతారు. ఇదే విధంగా వారు గతంలో ఘనపూర్  (ములుగు), మోండా మార్కెట్ (సికింద్రాబాద్), వెంసూర్, కొత్తగూడెం, KUC మరియు సుబేదారీ పరిధిలో మోసం చేయగా వారిపై కేసులు నమోదు చేసి, జైల్ కు పంపడం  జరిగింది. ఈ మద్యకాలంలో వారు తెలంగాణలో చత్రినాక (హైదరాబాద్) మరియు నర్సంపేటలలో మోసం చేసినట్లు తెలిపినారు. 

నిందితులను పట్టుకోవడంలో  ప్రతిభ కబరిచిన టాస్క్‌ఫోర్స్‌ ఏసిపి మదుసూధన్‌, నర్సంపేట ఏసిపి రవీందర్ రెడ్డి, టాస్క్‌ఫోర్స్‌ ఇన్స్పెక్టర్ బాబులాల్, నర్సంపేట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎఎఓ సల్మాన్ పాషా, టాస్క్‌ఫోర్స్‌ మరియు నర్సంపేట సిబ్బందిని సిపి అభినందించారు.


#warangal 

Image 1

కామారెడ్డి డిఎస్పిగా యస్. మధుసూదన్ బాధ్యతల స్వీకరణ

Posted On 2026-05-04 19:01:07

Readmore >
Image 1

హైవేపై కారు అగ్ని ప్రమాదం... సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు..

Posted On 2026-05-04 18:53:54

Readmore >
Image 1

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, 5000 రూపాయల జరిమానా

Posted On 2026-05-04 18:51:37

Readmore >
Image 1

అంతర్రాష్ట్ర వాహన దొంగల ముఠాను పట్టుకున్న సంగారెడ్డి జిల్లా పోలీసులు

Posted On 2026-05-04 18:49:53

Readmore >
Image 1

రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జూనియర్ అసిస్టెంట్

Posted On 2026-05-04 18:24:03

Readmore >
Image 1

నకిలీ నోట్లను చలామణి చేస్తున్న ఎనిమిది వ్యక్తులు అరెస్టు

Posted On 2026-05-04 18:00:43

Readmore >
Image 1

నేలల సంరక్షణ.. ఎరువుల వినియోగం కీలకం

Posted On 2026-05-04 15:44:15

Readmore >
Image 1

దమ్మపేటలో వడదెబ్బతో వ్యక్తి మృతి

Posted On 2026-05-04 15:32:36

Readmore >
Image 1

పదవ తరగతి ఫలితాలలో మండలంలో మొదటి స్థానంలో నిలిచిన మన్విత కి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సన్మానం

Posted On 2026-05-04 15:31:43

Readmore >
Image 1

మహిళా కానిస్టేబుల్‌ను అవమానించిన నాగరాజుపై షాద్‌నగర్ పోలీసుల యాక్షన్

Posted On 2026-05-04 09:57:57

Readmore >