Posted on 2026-05-05 16:21:35
డైలీ భారత్, సూర్యాపేట: రోడ్డు ప్రమాదంలో ఎవరు ప్రాణాలు పోకూడదు ద్విచక్ర వాహనంపై ప్రయాణించేటప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలని ఎస్పి నర్సింహా ఐపీఎస్ గారు సూచించారు. అరైవ్ అలైవ్ రోడ్డు భద్రతలో భాగంగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, రోడ్డు నివారించడంలో పోలీసు అనుక్షణం కృషి చేస్తున్నాం అని తెలిపారు. సూర్యాపేట ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ జర్నలిస్టుల సంక్షేమంలో భాగంగా జిల్లా పోలీస్ శాఖ తరపున సెవెన్ స్టార్ సోలార్ ఎంటర్ప్రైజెస్ వారి సౌజన్యంతో హెల్మెట్ పంపిణీ చేశారు. సమాజంలో జరుగుతున్న ప్రభుత్వ అభివృద్ధి అంశాలు, పోలీసు కార్యకలాపాలు, శాఖల కార్యకలాపాలు ఇతర అంశాల గురించి ఎప్పటికప్పుడు ప్రజలకు, సమాజానికి చేరవేయడంలో జర్నలిస్టులు అనుక్షణం పనిచేస్తున్నారని అన్నారు. ఎండ వాన చలి అనక పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో హెల్మెట్స్ అందజేయడం జరిగిందని అన్నారు. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించి ప్రమాదాల సమయంలో ప్రధాన రక్షణ పొందాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి రవీందర్ రెడ్డి, 7 స్టార్ సోలార్ ఎంటర్ప్రైజెస్ అధికారి మల్లేష్, జర్నలిస్టు మిత్రులు పాల్గొన్నారు
ప్రజలు చెయిన్ సిస్టం వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు. జిల్లా ఎస్పీ : డాక్టర్.వినీత్ IPS
Posted On 2026-06-19 21:55:09
Readmore >
నీట్ రీ-ఎగ్జామ్ అభ్యర్థులకు టీజీఎస్ ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం
Posted On 2026-06-19 20:54:23
Readmore >
గాంధారి పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్
Posted On 2026-06-19 20:36:40
Readmore >
ఏసీబీకి చిక్కిన సర్వే ల్యాండ్ రికార్డు డిప్యూటీ ఇన్స్పెక్టర్
Posted On 2026-06-19 20:33:12
Readmore >
రవాణా శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఫైర్ సేఫ్టీపై అవగాహన కార్యక్రమం
Posted On 2026-06-19 19:17:58
Readmore >
గాంధీ సరోవర్ ప్రాజెక్ట్కు కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్
Posted On 2026-06-19 19:11:46
Readmore >
దేవాలయం పక్కన ఉన్న వైన్స్ (మద్యం)షాప్ నీ వెంటనే తొలగించాలి..బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
Posted On 2026-06-19 17:52:08
Readmore >