Posted on 2026-05-14 08:26:36
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం కబేలాలకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న 122 పశువులను పోలీసులు చాకచక్యంగా పట్టుకొని గోశాలల తరలించి కొంతమంది వ్యక్తులను అదుపులో తీసుకొని కేసు నమోదు చేసిన ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే చండ్రుగొండ ఎస్సై శివరామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి ఒరిస్సా రాష్ట్రం నవరంగాపూర్ నుంచి హైదరాబాదు కబేలాలకు తరలించేందుకు కొంతమంది వ్యక్తులు పన్నాగం పన్నారు. అందులో భాగంగాభద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామపంచాయతీ మహమ్మద్ నగర్ గ్రామంలో పశువులను డంపు చేశారు. చండుగొండ పోలీసులకు నమ్మదగిన సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించగా పోలీసులకు 122 పశువులు లభ్యమయ్యాయి అందులో 44 ఆవులు 78 ఎద్దులు ఉన్నాయని వాటన్నిటిని స్వాధీనం చేసుకొని పాల్వంచలోని గోశాలకు తరలించామని తెలిపారు. చంద్రుగొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
DRDOకు మరో భారీ విజయం.. సుదూర క్రూయిజ్ క్షిపణి పరీక్ష విజయవంతం..
Posted On 2026-06-15 22:15:08
Readmore >
రైతు నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన డిప్యూటీ తహసీల్దార్
Posted On 2026-06-15 20:42:50
Readmore >
ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో కామారెడ్డి జిల్లాను రాష్ట్రంలోనే నంబర్ 1గా ఉంచాలి : అడిషనల్ కలెక్టర్
Posted On 2026-06-15 19:19:40
Readmore >
సంచలనాత్మక హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
Posted On 2026-06-15 16:21:06
Readmore >