| Daily భారత్
Logo




శిక్షణ వినియోగించుకొని.. ఆర్థికంగా ఎదగాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

News

Posted on 2026-05-21 18:50:39

Share: Share


శిక్షణ వినియోగించుకొని.. ఆర్థికంగా ఎదగాలి : జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

ఆర్ సెటీ శిక్షణ కోర్సులతో యువతకు మేలు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆర్ సెటీ శిక్షణా కేంద్రం ప్రారంభం

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల : ఉచిత శిక్షణను యువతీ యువకులు వినియోగించు కోవాలని, ఆర్థికంగా ఎదగాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆకాంక్షించారు. కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ, బ్యాంకుల సహకారంతో ఆర్ సెటీ (రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్) ఆద్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నెహ్రూ నగర్ శిక్షణా కేంద్రంలో జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గురువారం ప్రారంభించారు. శిక్షణ ఇచ్చే, ట్రైనింగ్, వసతి గదులను ప్రారంభించి.. పరిశీలించారు. ఈ సందర్భంగా మగ్గం వర్క్ కింద శిక్షణ పొంది పలువురు అభ్యర్థులు సిద్ధం చేసిన వస్త్రాలను పరిశీలించి.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోజూ ఎన్ని గంటలు శిక్షణ పొందుతున్నారో ఆరా తీశారు. మగ్గం వర్క్ తర్ఫీదు పొందిన వారికి సర్టిఫికెట్లు అందజేశారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మార్చి 6వ తేదీన *ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక* కార్యక్రమాన్ని ప్రారంభించారని గుర్తు చేశారు. ఇందులో భాగంగా జూన్ 12వ తేదీ వరకు 10 శాఖల ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్న యువజన క్రీడా వారోత్సవాలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గతంలో ఉమ్మడి జిల్లా కేంద్రంలోనే ఆర్ సెటీ కేంద్రాలు ఉండేవని, ఇప్పుడు మన జిల్లాలో కూడా అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. జిల్లాలోని యువతీ యువకులు ఇక్కడ అందించే ఉచిత వసతి, భోజనం, శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. శిక్షణలో భాగంగా అందించే ప్రతి మెలకువను ఎంతో శ్రద్ధ, ఆసక్తితో నేర్చుకొని.. స్వయం ఉపాధిలో ఆ అంశాలు వినియోగించాలని సూచించారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ.. ఆర్థిక స్వాతంత్రం సాధించాలని ఆకాంక్షించారు. మరో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని పిలుపు నిచ్చారు. మార్కెట్, పరిశ్రమల అవసరాలు, అభ్యర్థుల డిమాండ్ కు అనుగుణంగా నూతన కోర్సులు ప్రారంభించాలని, ఏడాది అంతా శిక్షణ అందించాలని నిర్వాహకులకు జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, యూబీఐ డీజీఏం నటరాజ్, ఏజీఎం శ్రీనివాసరావు, ఎల్ డీ ఎం మల్లికార్జున రావు, శిక్షణ కేంద్రం బాధ్యులు, బ్యాంక్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >
Image 1

బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి

Posted On 2026-06-12 22:38:10

Readmore >
Image 1

పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే

Posted On 2026-06-12 21:45:03

Readmore >