Posted on 2026-05-22 20:06:53
సుమారు రూ. 8 లక్షల ఆస్తి నష్టం...
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ శివారులో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక కోళ్ల ఫారమ్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఫారమ్లోని సామగ్రితో పాటు వందలాది కోళ్లు సజీవ దహనమయ్యాయి.అగ్రహారం గ్రామానికి చెందిన ఆంజనేయులు ఈ కోళ్ల ఫారమ్ను నిర్వహిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగి వేగంగా విస్తరించాయి. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే, అప్పటికే ఫారమ్ పూర్తిగా కాలిపోవడంతో సుమారు రూ. 8 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు ఆంజనేయులు కన్నీటి పర్యంతమయ్యారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >