Posted on 2026-05-22 19:31:49
385 కిలోల గంజాయి స్వాధీనం – ఇద్దరు అరెస్ట్
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాజాగా నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో భారీ మొత్తంలో గంజాయి పట్టుబడింది. మొత్తం 385 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, రామవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీఓ చెక్పోస్ట్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో లారీలు మరియు బోలెరో వాహనాలను పరిశీలించగా గంజాయి తరలింపు వెలుగులోకి వచ్చింది. గంజాయిని అత్యంత చాకచక్యంగా దాచిపెట్టి ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ఆపరేషన్లో పాల్గొన్న ప్రత్యేక బృందం అప్రమత్తంగా వ్యవహరించి నిందితులను అదుపులోకి తీసుకుంది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ లక్షల్లో ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
జిల్లాలో గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని, ఎవరైనా గంజాయి రవాణా లేదా విక్రయాలపై సమాచారం అందిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఎస్పీ సూచించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై కఠిన చర్యలు కొనసాగుతాయని హెచ్చరించారు.
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >