Posted on 2026-05-23 19:53:13
యువత రక్త దానానికి ముందుకు రావాలి
తల సేమియా బాధిత చిన్నారుల ప్రాణాలను కాపాడుదాం
ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు
డైలీ భారత్, కామారెడ్డి: తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి సిరిసిల్ల రోడ్ గల ఆదిత్య వైద్యశాలలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, ఐవిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చిలువేరి మారుతిలు తెలియజేశారు. వేసవి కాలం కావడంతో తల సేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు రక్తం దొరకక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారి ప్రాణాలను కాపాడడం కోసమే ఈ రక్తదానం శిబిరం నిర్వహిస్తున్నామని ఈ శిబిరంలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి చిన్నారుల ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు మొదటగా రక్తదానం చేసే 120 మంది రక్తదాతలకు హెల్మెట్లను ఆ తరువాత రక్తదాతలకు ప్రశంసా పత్రాలను కీ చైన్ ను అందజేయడం జరుగుతుందని అన్నారు. మరిన్ని వివరాలకు 9492874006 నెంబర్ కి సంప్రదించాలని అన్నారు.
ఈ సమావేశంలో ఎర్రం చంద్రశేఖర్,జమీల్ అహ్మద్,డాక్టర్ వేద ప్రకాష్,పర్ష వెంకటరమణ,డాక్టర్ పుట్ల అనిల్,జలిగామ శ్రీకాంత్,దొంతి సుధాకర్,కస్వ వెంకటేష్ లు పాల్గొనడం జరిగింది.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >