Posted on 2026-07-11 04:14:53
డైలీ భారత్, కాకినాడ: స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిస్తామని, ప్రతి నెల స్థిరమైన లాభాలు ఇస్తామని నమ్మబలికి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఘటన కాకినాడలో వెలుగుచూసింది.
జిల్లా క్రీడా మైదానం ఎదురుగా ఉన్న కేఆర్కే ప్లాజాలో "ఆల్మైటీ జెనెసిస్ క్యాపిటల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్" పేరుతో కార్యాలయం నిర్వహిస్తూ నిందితులు 2023 జూలై నుంచి ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బు సేకరించారు.
అందిన ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ జి. బింధు మాధవ్ ఆదేశాలతో, అదనపు ఎస్పీ ఎం. కిశోర్ కుమార్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.
ఈ కేసులో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పులుగు మోజేష్, డైరెక్టర్ సంధనా లలిత అంబికలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 6 ల్యాప్టాప్లు, 4 సెల్ఫోన్లు, 1 కారుతో పాటు పెట్టుబడులకు సంబంధించిన బాండ్లు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
దర్యాప్తులో మొత్తం 7,342 పెట్టుబడుల ద్వారా రూ.98.66 కోట్లకు పైగా సేకరించినట్లు తేలింది. వీటిలో 3,633 పెట్టుబడులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. వాటి విలువ రూ.53.87 కోట్లు. ఇప్పటివరకు పెట్టుబడిదారులకు లాభాలతో కలిపి రూ.16.13 కోట్లు చెల్లించగా, ఇంకా రూ.37.74 కోట్లు చెల్లించాల్సి ఉంది.
అరెస్టు చేసిన నిందితులను కాకినాడ స్పెషల్ మొబైల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచినట్లు అదనపు ఎస్పీ ఎం. కిశోర్ కుమార్ తెలిపారు.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని ₹1 లక్ష డిమాండ్... సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ చైర్మన్పై కేసు
Posted On 2026-07-10 18:53:44
Readmore >
క్షణాల్లో స్పందించిన పిట్లం పోలీసులు : ఆత్మహత్యాయత్నం నుంచి మహిళకు రక్షణ
Posted On 2026-07-10 18:24:01
Readmore >
విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన కే.మదన్ కుమార్ గుప్త
Posted On 2026-07-10 17:31:57
Readmore >
₹10 కోట్ల గోల్డ్ లోన్ స్కామ్ : బ్యాంకు అప్రైజర్ అరెస్టు, ₹5.81 కోట్ల బంగారం రికవరీ
Posted On 2026-07-10 17:13:30
Readmore >
రాజన్న సిరిసిల్ల ఘోర రోడ్డు ప్రమాదం : ఆర్టీసీ బస్సు డ్రైవర్ అరెస్ట్, రిమాండ్కు తరలింపు
Posted On 2026-07-10 16:20:54
Readmore >
ఎస్పీ వార్నింగ్ : దాబాల్లో అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలే - కామారెడ్డి పోలీసుల దాడి
Posted On 2026-07-10 16:18:06
Readmore >
రాజన్న సిరిసిల్ల DEOని కలిసిన TGPETA బృందం... క్రీడా వసతులపై వినతి
Posted On 2026-07-10 14:47:58
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసుల ప్రతిభ : రాష్ట్ర జోనల్ మీట్లలో మెరిసిన పోలీస్ అధికారులు, సిబ్బంది
Posted On 2026-07-10 14:35:04
Readmore >
లక్ష్మీదేవిపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
Posted On 2026-07-10 14:21:15
Readmore >