Posted on 2024-07-16 20:47:48
డైలీ భారత్, హైదరాబాద్: మూడేళ్లుగా పెండింగ్లో ఉన్న పీ రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయించాలని సిరిసిల్ల డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు కోరారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో ఎమ్మెల్యే కేటీఆర్ను కలిసి విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. ఆర్థిక లేమితో అల్లాడుతున్న కళాశాలల యాజమాన్యాల పరిస్థితిని అర్ధం చేసుకుని అసెంబ్లీ వేదికగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేశారు. సానుకూలంగా స్పందించిన కేటీఆర్ 2019లో తమ ప్రభుత్వం అధికారంలో వచ్చే నాటికి రూ.1800కోట్లు పీ రీయింబర్స్మెంట్ నిధులు పెండింగ్లో ఉన్నాయని, అవన్నీ సమయానుకూలంగా చెల్లించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెండింగ్లో ఉన్న పీజు బకాయలు చెల్లించాలని డిమాండ్ చేసారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో కాలేజీ యాజమాన్యాలకు రావాల్సిన రీయింబర్స్మెంట్ నిధుల విషయంలో కొట్లాడి సాధించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాలల నిర్వాహకులు గుగ్గిళ్ల జగన్ గౌడ్, గెంట్యాల భూమేశ్, కొలనూరు శేఖర్ రెడ్డి, రేశం శ్రీకాంత్, మారం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >