Posted on 2024-07-17 01:06:33
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా:ఎప్పుడు ఏ ఎమ్మెల్యే పార్టీ మారుతారో… ఏ నాయకుడు పార్టీని వీడారని వార్త వినిపిస్తుందో అన్న టెన్షన్ లో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి మరిన్ని షాకులు తగిలేలా కనపడుతున్నాయి. అసెంబ్లీ మొదలయ్యే లోపే విలీన ప్రక్రియ పూర్తిచేస్తామంటున్న కాంగ్రెస్ వ్యాఖ్యలకు బలం చేకూర్చేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు కనపడుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఇష్యూ, ఎమ్మెల్యేల ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేలంతా స్పీకర్ ను కలవాలని నిర్ణయం తీసుకున్నారు. హరీష్ రావు-కేటీఆర్ ల ఆధ్వర్యంలో స్పీకర్ ను కలబోతున్నందున… అందరూ ఈ మీటింగ్ రావాలని సమాచారం ఇచ్చారు. కానీ, బీఆర్ఎస్ పిలుపుకు 14మంది ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టారు. కేసీఆర్ ను తీసేస్తే… 13మంది ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదు అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ కు 38మంది ఎమ్మెల్యేలు ఉండగా… అందులో 10మంది కాంగ్రెస్ గూటికి చేరారు. మిగిలిన 28మందిలో కేవలం 14మందే స్పీకర్ ను కలిసే మీటింగ్ వచ్చారు. తాజాగా డుమ్మా కొట్టిన వారిలో మాజీ మంత్రి మల్లారెడ్డి పలువురు ఎమ్మెల్యేలున్నారు. డుమ్మాకొట్టిన వారంతా పార్టీ మారబోతున్నారా…? వచ్చిన వారిలోనూ ఎవరెవరు ఉంటారో… అన్న చర్చ జోరుగా సాగుతోంది.
అంతర్రాష్ట్ర కల్తీ నెయ్యి ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్లకు పైగా కల్తీ నెయ్యి స్వాధీనం
Posted On 2026-06-18 20:52:31
Readmore >
కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ
Posted On 2026-06-18 20:47:25
Readmore >
ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలి తపస్ నాయకుల వినతిపత్రం
Posted On 2026-06-18 20:43:25
Readmore >
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా నిర్మాణాలు చేపడితే తగిన బుద్ధి చెబుతాం : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-18 18:24:01
Readmore >
నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ విభాగాన్ని ప్రారంభించిన 6 వ వార్డ్ కౌన్సిలర్ నిట్టు గంగాధర్
Posted On 2026-06-18 18:21:32
Readmore >
రెండో పెళ్లి గురించి తెలిసినంత మాత్రాన బంధువులు నేరస్తులు కాలేరు : సుప్రీంకోర్టు సంచలన తీర్పు
Posted On 2026-06-18 17:26:43
Readmore >