| Daily భారత్
Logo




దారుణం... దుర్గాదేవి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

News

Posted on 2024-10-11 10:26:29

Share: Share


దారుణం... దుర్గాదేవి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు

డైలీ భారత్, హైదరాబాద్: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దారుణం చోటు చేసుకుంది. దేవి నవరాత్రుల సందర్భంగా ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహాన్ని గత అర్థరాత్రి దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం స్థానికులు గుర్తించి.. నిర్వాహకులకు సమాచారం అందించారు. దీంతో అమ్మవారి భక్తులతోపాటు పలు హిందు సంఘాల నేతలు.. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌కు చేరుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బేగంబజార్ పోలీసులు నాంపల్లి గ్రౌండ్స్‌కు చేరుకున్నారు

అబిడ్స్ ఏసీపీ చంద్రశేఖర్‌తోపాటు ఇతర పోలీస్ ఉన్నతాధికారులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేశారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోకి ప్రవేశించిన దుండగులు తొలుత విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఆ తర్వాత ఆ ప్రదేశంలోని సీసీ కెమెరాలను పగలకొట్టారు. అనంతరం అమ్మవారి విగ్రహం చేతిని విరగొట్టారు. అంతేకాకుండా అమ్మవారి విగ్రహం వద్దనున్న పూజా సామాగ్రిని సైతం చెల్లాచెదురుగా పడేశారు. అమ్మవారి విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లను సైతం దుండగులు తొలగించారు.

ప్రతి ఏడాది ఎక్కడో అక్కడ హిందు దేవతల విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారని ఈ సందర్భంగా భక్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం హిందూదేశంలో ఉన్నామా? లేకుంటే ఇస్లామిక్ దేశంలో ఉన్నామా? అని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విగ్రహంపై దాడి చేసిన దుండగులను వెంటనే పట్టుకొని కఠినంగా శిక్షించాలని పలు హిందు సంఘాలు నేతలు డిమాండ్ చేస్తున్నారు.

ఇంకోవైపు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రతి ఏడాది ఎగ్జిబిషన్ సొసైటీ, సిబ్బంది ఆధ్వర్యంలో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. అందులోభాగంగా ప్రతి ఏడాదిలాగానే ఈ ఏడాది విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే గురువారం రాత్రి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో దాండియా కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమం అయ్యే వరకు పోలీసులు అక్కడే విధులు నిర్వహించారని ఉన్నతాధికారులు తెలిపారు. అమ్మవారి విగ్రహాం ధ్వంసం ఘటన అర్థరాత్రి లేకుంటే... శుక్రవారం తెల్లవారుజామున జరిగి ఉండవచ్చని పోలీస్ ఉన్నతాధికారులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల పుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Image 1

పేదింటి పెళ్లికూతురికి పుస్తే మట్టలు అందచేసిన TPCC రాష్ట జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి

Posted On 2026-04-12 11:41:31

Readmore >
Image 1

శీర్షిక : ఆడది ఆటబొమ్మ కాదు-- మంజుల పత్తిపాటి

Posted On 2026-04-12 08:16:03

Readmore >
Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >
Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >
Image 1

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాటం

Posted On 2026-04-11 21:20:31

Readmore >
Image 1

డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్

Posted On 2026-04-11 20:02:47

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:50:42

Readmore >
Image 1

జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:48:36

Readmore >
Image 1

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-11 19:47:25

Readmore >
Image 1

శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం

Posted On 2026-04-11 19:43:57

Readmore >