| Daily భారత్
Logo




గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ జి ప్లస్ త్రీ నిర్మాణాలు

News

Posted on 2025-04-29 18:25:42

Share: Share


గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ జి ప్లస్ త్రీ నిర్మాణాలు

హద్దులు దాటి జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణం

లక్ష్మీదేవి పల్లి పంచాయతీలో అనేక అక్రమ నిర్మాణాలు 

పట్టించుకోని సెక్రటరీ మండల అధికారులు  

డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామపంచాయతీలో చాతకొండ వెళ్లే రహదారి పక్కన కృష్ణవేణి కాలేజీ ఎదురుగా  హద్దులు దాటి అక్రమ నిర్మాణాలు అధికారుల కనుసన్నాల్లోనే వెలస్తున్నాయి.. ఇవేవీ పట్టనట్లు వ్యవహరిస్తున్న పంచాయతీ అధికారులు మండల అధికారులు. 1/70 గిరిజన చట్టాలను తుంగలో తొక్కుతూ జీ ప్లస్ త్రీ నిర్మాణాలు చేపడుతున్న ఇవేమీ మాకు పట్టవు అన్నట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు. ఏజెన్సీ చట్టాలు లక్ష్మీదేవి పల్లి పంచాయతీకి వర్తించవు అన్న రీతిగా అక్రమ నిర్మాణాలు వెలుస్తున్న పంచాయతీ సిబ్బంది నోటీసులు కూడా ఇవ్వకపోవడం వెనక ఆంతర్యం ఏమిటి ?. నిర్మాణము మొదలు పెడితేనే నోటీసులు ఇచ్చాము అని చెప్పే పంచాయతీ సిబ్బంది ఈ జి ప్లస్ త్రీ నిర్మాణానికి కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదంటే ఏ విధంగా అక్రమ నిర్మాణాలకు అధికారులు ప్రోత్సహిస్తున్నారో అర్థమవుతుంది. ఇదంతా ఒక ప్లాను ప్రకారమే జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పునాది వేసినప్పుడే అడ్డుపడాల్సిన పంచాయతీ సిబ్బంది జి ప్లస్ త్రీ నిర్మాణం చేసినా కూడా కల్లుండి చూడలేని రీతిగా వ్యవహరిస్తున్నారని ఎటువంటి సందేహం లేదు. కాసులకు కక్కుర్తి పడి చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి  జి ప్లస్ త్రీ నిర్మాణం చేస్తున్న చూడకపోవడం మరి విడ్డూరంగా ఉంది. మండల అధికారులు పంచాయతీలలో పర్యవేక్షిస్తున్నారా లేరా అనే సందేహము లేకపోలేదు. అంటే ఈ జి ప్లస్ త్రీ అక్రమ నిర్మాణం ఎవరికి కనిపించలేదంటారా లేక ముడుపులు ఏమైనా అందాయ అని అనుకుంటున్న ప్రజలు.  ఇటువంటివి దాదాపు ఈ పంచాయతీలోనే పదుల సంఖ్యలో నిర్మాణాలు  ఉన్నాయంటే పరిస్థితి ఊహించుకోవచ్చు. ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టే అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతుంది వీటిని అరికట్టేది ఎవరు? నోటీసులు ఇచ్చామంటూ చేతులు దులుపుకుంటున్నారు .వాటిని ఆపే ప్రయత్నం ఏ అధికారి చేయలేకపోవడం వంటివి చూస్తుంటే  పంచాయతీలో ఏ విధంగా డబ్బు చేతులు మారుతుందో అర్థమవుతుంది. ఇకనైనా జిల్లా అధికారులు కల్పించుకొని అక్రమ నిర్మాణాలను ఆపాలని కోరుతున్నా ప్రజలు . అక్రమ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు తెలియవలసి ఉన్నది.జిల్లా అధికారులు జోక్యం చేసుకొని ఇట్టి అక్రమ నిర్మాణాలు నిలుపుదాల చేయవలసిందిగా కోరుతున్న ప్రజలు. ఇట్టి నిర్మాణాలకు సహకరిస్తున్న పంచాయతీ మండల అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు..

Image 1

జనరల్ టికెట్ పై రైల్వే శాఖ హెచ్చరిక

Posted On 2026-06-14 09:20:07

Readmore >
Image 1

కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్

Posted On 2026-06-14 08:30:06

Readmore >
Image 1

హ్యూమన్‌ రైట్స్‌ జిల్లా చైర్మన్‌గా దేవోల్లా రాములు

Posted On 2026-06-13 20:33:57

Readmore >
Image 1

అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి

Posted On 2026-06-13 20:32:49

Readmore >
Image 1

ప్లాట్ఫారం మీద బ్రతికే కార్మికుల పై పంచాయతీ కన్ను

Posted On 2026-06-13 11:36:13

Readmore >
Image 1

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన

Posted On 2026-06-13 11:35:06

Readmore >
Image 1

కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు

Posted On 2026-06-13 11:33:30

Readmore >
Image 1

కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు

Posted On 2026-06-13 11:31:24

Readmore >
Image 1

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం

Posted On 2026-06-13 11:26:02

Readmore >
Image 1

రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?

Posted On 2026-06-13 11:25:04

Readmore >