Posted on 2025-05-12 17:55:16
డైలీ భారత్, హైదరాబాద్:టీజీఐఐసీ పరిధిలో లక్షా 75 వేల ఎకరాలను తాకట్టు పెట్టే కుట్రపూరిత స్కెచ్ వేసిన రేవంత్ రెడ్డి
నా దగ్గర నిర్ధిష్టమైన ఆధారాలు ఉన్నాయి
టీజీఐఐసీని ప్రైవేటు లిమిటెడ్ నుంచి పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చడానికి ప్రభుత్వం రహస్య జీవోను విడుదల చేసింది
కంపెనీ హోదాను మార్చడం ద్వారా మరిన్ని వేల కోట్ల రుణం పొందాలన్నది ప్రభుత్వ ఆలోచన
తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజిలో కుదువపెట్టే కుట్ర జరుగుతోంది
పెద్ద మొత్తంలో అప్పులు తీసుకోడానికి టీజీఐఐసీ ద్వారా ద్వారాలు తెరిచారు
కంపెనీ హోదా మార్పు విషయాన్ని ప్రజలకు చెప్పకుండా ఎందుకు దాచిపెట్టారు
తెలంగాణ భూములను స్టాక్ ఎక్సేంజ్ లో తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది ?
స్టాక్ ఎక్సేంజ్ లో నష్టం జరిగితే తెలంగాణలో జమా చేసుకున్న భూముల భవితవ్యం ఏమిటి ?
తెలంగాణ ప్రజల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కనీస ఆలోచన చేయకపోవడం దారుణం
టీజీఐఐసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
గత 16 నెలల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి రూ 1.8 లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారు
తెచ్చిన అప్పులతో ఒక్క పథకాన్ని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు, అభివృద్ధికి వెచ్చించలేదు
తులం బంగారం ఇవ్వలేదు, మహాలక్ష్మీ పథకాన్ని అమలు చేయలేదు, ఏమీ చేయలేదు
గతంలో చేసిన అప్పులకు కేవలం 80 వేల కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం తిరిగి చెల్లించింది
మిగిలిన లక్ష కోట్లు ఎక్కడికి వెళ్లాయి ?
ఆధారాలతో ఆరోపణలు చేస్తున్నాను... లక్ష కోట్లను పెద్ద కాంట్రాక్టర్లకు చెల్లించారు
ఇది 20 శాతం కమీషన్ సర్కార్
కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేసి నేరుగా 20 శాతం కమీషన్ తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
దాదాపు 20 వేల కోట్లు రేవంత్ రెడ్డి సొంత ఖజానాకు వెళ్లింది
నేను చెప్పింది అప్పయితే ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి
ఒక మంత్రి సొంత కంపెనీకి, మెఘా కంపెనీకి బిల్లులు చెల్లిస్తున్నారు కానీ చేసిన అభివృద్ధి పనులకు కాదు
వేల కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఒక్క మంచి పని కూడా చేయలేదు
తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి నీచమైన మాటలు మాట్లాడుతున్నారు
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాలను తాకట్టు పెట్టి రూ 10 వేల కోట్లు అప్పు తెచ్చారు
చెట్లను, ప్రకృతిని నాశనం చేసే ప్రయత్నం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలు ఆందోళన చేశారు
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >
చిన్నారి సహస్ర ఉన్నత విద్యకు శ్రీమాతా సేవ చారిటబుల్ సంస్థ అండ
Posted On 2026-06-22 20:51:08
Readmore >
సభ్యత్వం లోనే కాదు రక్తదానంలో కూడా ముందంజలో రెడ్ క్రాస్ కామారెడ్డి
Posted On 2026-06-22 20:50:12
Readmore >
అత్యవసర పరిస్థితులలో లో రక్తదానం చేసిన ప్రముఖ వ్యాపార వేత్త చిలా గోపి
Posted On 2026-06-22 20:48:51
Readmore >
జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి – రైతులు ఆందోళన చెందవద్దు : జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్
Posted On 2026-06-22 20:47:06
Readmore >
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-22 20:09:38
Readmore >