Posted on 2025-05-13 12:06:09
వ్యాపారుల నుండి 120 ఖాళీ బ్యాంక్ చెక్స్, 570 ప్రాంసరీ నోట్లు, 38 బాండ్లు స్వాధీనం
అక్రమ వ్యాపారం నిర్వహిస్తున్న ఆరుగురిపై కేసు నమోదు
ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి
డైలీ భారత్, ఖమ్మం: నిబంధనలకు విరుద్ధంగా చిటీలు, ఫైనాన్స్/ గిరిగిరి వ్యాపారం నిర్వహిస్తున్న పలువురి ఇండ్లలో పోలీసులు సోదాలు నిర్వహించారని ఖమ్మం టౌన్ ఏసీపీ రమణమూర్తి తెలిపారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు నగరంలో నిబంధనలు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రవేటు చిట్స్, అధిక వడ్డీలతో ప్రజలను పీడిస్తున్న ఫైనాన్స్/ గిరిగిరి వ్యాపారుల ఇండ్లలో ఏకకాలంలో 11 చోట్ల దాడులు నిర్వహించి తనిఖీలు చేసినట్లు తెలిపారు లక్షల విలువ చేసే 120 ఖాళీ బ్యాంక్ చెక్స్, 570 ప్రాంసరీ నోట్లు, 38 బాండ్లు లభ్యమయ్యాయినట్లు తెలిపారు. చిట్ నిర్వహుకులు తమ కస్టమర్ల నుండి సేకరించిన డబ్బును చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేయడం, దౌర్జన్యాలు, దాడులు చేయడం వంటి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న చిట్స్, ఫైనాన్స్ వ్యాపారుల ఇండ్లలో తనిఖీ చేసి ఆరుగురిలో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించి వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. అధిక వడ్డీ వ్యాపారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు.
కూలీలను కబళించిన ప్రమాదం.. టైరు పేలడంతో బోల్తాపడ్డ టాటా ఏస్, ముగ్గురు మృతి
Posted On 2026-06-23 12:14:31
Readmore >
నిజామాబాద్ లో ఎక్సైజ్ సూపరిండెంట్ ఇంట్లో ఏసీబీ అధికారుల దాడుల కలకలం
Posted On 2026-06-23 11:59:52
Readmore >
ఒలింపిక్ స్ఫూర్తిని ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి : మంత్రి వాకిటి శ్రీహరి
Posted On 2026-06-23 11:09:19
Readmore >
పల్నాడు జిల్లా : అఖిల భారత అయ్యప్ప భక్తుల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కొప్పురావూరి గిరీష్ కుమార్
Posted On 2026-06-22 21:29:25
Readmore >
నకిలీ ట్రక్ చిట్టీలు సృష్టించి ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన కేసులో మరో నిందుతుడు అరెస్టు రిమాండ్
Posted On 2026-06-22 21:24:09
Readmore >
ABVP ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు బంద్ కి పిలుపునిచ్చింది
Posted On 2026-06-22 20:54:00
Readmore >