Posted on 2025-06-01 18:10:19
డైలీ భారత్, రంగారెడ్డి జిల్లా: అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి అన్నారు. ఆదివారం మొయినాబాద్ l మండలం మేడిపల్లి, వీరన్నపేట్, హిమాయత్ నగర్ గ్రామంలో గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్యతో కలిసి ఆయన భూమి పూజ చేసి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ సర్టిఫికెట్ అందించారు.ఈ సందర్భంగా చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరు సొంతింటిని కలిగి ఉండాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కల అన్నారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంతింటి కలను నిజం చేస్తుందన్నారు.అర్హులైన ప్రతి పేదవారికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనుంది అన్నారు. పేదల అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రభుత్వం పని చేస్తుందన్నారు గతంలో కూడా కాంగ్రెస్ హయాంలోనే ఇందిరమ్మ ఇళ్లను ఇవ్వడం జరిగిందని తెలిపారు,అన్ని వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, ఇందిరమ్మ రాజ్యంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి,మంత్రులు నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. పేదలకు అండగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని వివరించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కాలే శ్రీకాంత్ ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు షాబాద్ దర్శన్,అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >