Posted on 2023-12-11 19:08:55
ప్రయాణికులు సురక్షితంగా గమ్యం చేరుకోవాలి
సిరిసిల్ల ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు
రోడ్ సేఫ్టీపై విద్యార్థులతో అవగాహన ర్యాలీ
డైలీ భారత్, సిరిసిల్ల : ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికులు సురక్షితంగా తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని సిరిసిల్ల ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు విజ్ఞప్తి చేశారు. సోమవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు పట్టణంలోని శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్ విద్యార్థులతో రోడ్ సేఫ్టీ పై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. హెల్మెట్ ధరించిన, సిట్ బెల్ట్ పెట్టుకున్న వారికి విద్యార్థులు పువ్వులను అందించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజు మాట్లాడుతూ ఎక్కువ మంది అవగాహనా లోపం, అధిక వేగం, నిర్లక్ష్యం, మద్యం తాగి వాహనాలు నడపడం, సెల్ఫోన్ డ్రైవింగ్ , ట్రిపుల్ డ్రైవింగ్ , ఓవర్ టేకింగ్ తదితర తప్పుల వల్ల ప్రమాదాల బారిన పడటమే కాకుండా ఎదుటివారిని కూడా ప్రమాదాల బారిన పడేసే అవకాశం ఉందని తెలిపారు. అందరికీ అర్థమయ్యేలా నినాదాలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించామని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రయాణం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ఆకునూరీ వెంకటేష్ తోపాటు ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >