| Daily భారత్
Logo




సమస్యను పరిష్కరించకుండా కదిలేదే లేదంటున్న ఆదివాసీలు

News

Posted on 2025-06-09 19:21:40

Share: Share


సమస్యను పరిష్కరించకుండా కదిలేదే లేదంటున్న ఆదివాసీలు

నిరావాదిక నిరాహార దీక్ష చేపట్టిన రామన్నగూడెం ప్రజలు

పెండింగ్ లో ఉన్న సర్వే నెంబర్ భూములు సమగ్ర సర్వే చేయాలంటూ డిమాండ్

మా సమస్యను పరిష్కరించకుంటే ఉద్రితరం చేస్తామంటున్న ఆదివాసీలు

డైలీ భారత్, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల కేంద్రంలో స్థానిక తహసిల్దార్ కార్యాలయం ఎదుట అశ్వరావుపేట మండలం రామన్నగూడెం పంచాయతీ ప్రజలు రామన్నగూడెం సరిహద్దుల్లో ఉన్న సర్వే నంబరు 30, 36, 39 నంబరు గల భూములను అధికారులు సమన్యాయ సర్వే నిర్వహించి స్థానికంగా ఉన్న ఆదివాసీలకు పంచాలంటూ నిరవధిక నిరాహార దీక్ష సోమవారం రోజు నిర్వహించారు, 

గతంలో ఉన్న భూములు అధికారులు అడ్డుకొని సాగు పరిణామానికి లో బోడకొండ తీవ్ర అసంఘటిత కార్యకలాపాలు చూపి నిర్వీర్యం చేసి పేదల చేతిలో ఒట్టి మట్టి పెట్టలే పెట్టారంటూ స్థానికంగా ఉన్న ఆదివాసీలు నిరుత్సాహబోతున్నారు, 

ఏది ఏమైనాప్పటికీ ఇటు అటవీశాఖ అధికారులు మరియు రెవెన్యూ శాఖ అధికారులు తక్షణమే తమకు న్యాయం చేయాలని, మా ఆదివాసీలపై సమన్వయం చూపించకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు, చిన్నపిల్లల సైతం నిరావధిక నిరాహార దీక్షలో చిన్నపిల్లలు సైతం వెంబడి తీసుకొచ్చారు అంటే ఆదివాసీలు కు ఏ మాత్రాన కడుపు రగిలి పోతుందో స్పష్టంగానే అర్థమవుతుంది, 

భూములు అడ్డుకున్నది ఎవరు....?

గతంలో సాగు చేస్తున్న సర్వే నెంబరు 30 36 39 భూముల్లో కొందరు ఆదివాసి లు సాగులో ఉన్న నేపథ్యంలో పంటను సైతం చేతికి దక్కించకుండా అడ్డుపడ్డదాకలాలు అనేక పట్టణాల్లో మనం చూస్తూనే ఉన్నాం, నేడు ఉన్న పరిస్థితికి నిరుపేదలైన ఆదివాసీలు చేసేదేమీ లేక కడుపు రగిలి రోడ్డు ఎక్కే పరిస్థితి కూడా ఏర్పడిన సంఘటన కొత్తగూడెం జిల్లాలో అశ్వరావుపేట మండలం లో స్పష్టంగా అర్థమవుతుంది, ఇది ఈ ప్రభుత్వ పాలన లేక గత ప్రభుత్వ పాలన అన్నది కూడా అర్థం కాని పరిస్థితి ఇక్కడ వెలుగు చూపుతుంది, 

నూతనంగా వచ్చిన తాసిల్దార్ మాత్రం...

గతంలోనూ వారి వద్ద నుంచి కొన్ని ఫిర్యాదులు తీసుకొని జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపించిన తరుణంలో ఎలాంటి సమాధానం రాలేదంటూ సమాధానం చెప్పుతుండటం ఆశ్చర్యానికి గురి గురిచేస్తుంది. 

కేవలం నేను ఒక సమాచార ఉద్యోగిగానే మీ సమాచారాన్ని చేరవేస్తాను తప్ప నేను చేసేదేమీ లేదంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ ఉండటంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి 

వీటన్నింటికీ కారణం ఎవరు.....

గత ప్రభుత్వంలో భూములేని నిరుపేదలు కొంత సాగు మేరకు భూములు సదులు చేసుకొని సాగుచేసుకుంటున్న మాట ఎదుటమే కొందరికి పట్టాలు వచ్చిన మాట నిజమే, 

మరి వీటిని ఎందుకు అడ్డుకుంటున్నారు ఎవరు అడ్డుకుంటున్నారు అన్న ప్రశ్నలు మాత్రం ఆదివాసీల గుండెల్లో మిగిలిపోతున్నాయి, 

చేసేదేమీ లేక రోడ్డుకి మా భూములు మాకు ఇవ్వండి అంటూ ప్రచారం చేసే కాడికి వచ్చిందంటేనే ఎంతటి దౌర్భాగ్యంలో ఉందో  ఆదివాసీల పరిస్థితి స్పష్టంగా అర్థమవుతుంది 

నీవ్వురా పోయినా కవ్వించేదెవరు....

నిజానికి మారుపేరైన ఆదివాసీలు నీకు ఇస్తా అంటే సంబరపడిపోయే ఆదివాసీలు, రేపు మరసటి రోజు సర్వే జరుగుతుంది అంటే సంబరపడిపోయి ఎంతటి బాధను సైతం లెక్కచేయకుండా నవ్వుతూ వెళ్ళిపోయే ఆదివాసీలకు నిజానికి నిరుత్సాహమే మిగులుతుంది

కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న సమగ్ర సర్వే చేసి సాగు చేయటానికి భూమి నాధుడే లేక ఆదివాసీల గుండె గిలగిలా కొట్టుకుంటుంది, 

ఇకనైనా స్పందించండి సారు...

ఈ సందర్భంగా ఆదివాసీలు మాట్లాడుతూ మా సమస్యను వెంటనే పరిష్కరించాలని పరిష్కరించండి ఎడల అన్ని సంఘాల ఆదివాసి నాయకులతో కలిసి సమ్మె ఉధృతం చేస్తామని, స్థానిక శాసనసభ్యులు సైతం చేతులు మొక్కి వాళ్ళ మొర మీడియాకి చెప్పుకున్నారు

Image 1

డీ అడిక్షన్, కౌన్సెలింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి గితే

Posted On 2026-04-11 22:48:59

Readmore >
Image 1

సిరిసిల్ల నేతన్న అద్భుత సృష్టి

Posted On 2026-04-11 21:25:59

Readmore >
Image 1

ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ జేఏసీ నిరంతరం పోరాటం

Posted On 2026-04-11 21:20:31

Readmore >
Image 1

డి-అడిక్షన్ సెంటర్‌ను సందర్శించిన వరంగల్ పోలీస్ కమిషనర్

Posted On 2026-04-11 20:02:47

Readmore >
Image 1

జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:50:42

Readmore >
Image 1

జంగంపల్లి గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

Posted On 2026-04-11 19:48:36

Readmore >
Image 1

ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా ఆసుపత్రిలో ‘డి-అడిక్షన్’ సేవలు - ప్రారంభించిన జిల్లా ఎస్పీ

Posted On 2026-04-11 19:47:25

Readmore >
Image 1

శ్రీనిధి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ మరియు మంజీరా డిగ్రీ అండ్ పీజీ కాలేజీ వార్షికోత్సవం

Posted On 2026-04-11 19:43:57

Readmore >
Image 1

సామాజిక న్యాయం చెప్పటం కాదు - అమలు చేయాలి

Posted On 2026-04-11 17:27:29

Readmore >
Image 1

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన బీజేపీ నాయుకులు తంబళ్ల రవి

Posted On 2026-04-11 17:12:24

Readmore >