Posted on 2025-06-19 10:34:19
డైలీ భారత్, తమిళనాడు: కుమార్తె వేరేవ్యక్తితో వెళ్లిపోవడంతో మనస్తాపంతో ఆమె తల్లి, అవ్వ ఇద్దరు మనవరాళ్లను చంపి ఆపై ఉరేసుకొన్న విషాధఘటన తమిళనాడు రాష్ట్రంలో దిండుక్కల్ జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసుల కథనం మేరకు..
ఓట్టన్సత్రం సమీపంలోని చిన్నకులిప్పట్టికి చెందిన పవిత్ర(27)కు తొమ్మిదేళ్ల కిందట వివాహామైంది. దంపతుల మధ్య గొడవల కారణంగా పుట్టింటికి వచ్చేసింది. కొద్దినెలలుగా పవిత్ర తన కుమార్తెలు లిథిక్సా(8), దీపికా(5)తో చిన్నకులిప్పట్టిలోని తల్లి కాళీశ్వరి ఇంట్లో ఉంటోంది. మంగళవారం బయటకెళ్లిన పవిత్ర తిరిగి రాలేదు. ఆమె వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని వెళ్లిపోయినట్లు తెలుసుకున్నారు. మనస్తాపం చెందిన కాళీశ్వరి(47), తన తల్లి చెల్లమ్మాల్(65)తో కలిసి మనవరాళ్లు లిథిక్సా, దీపికాను ఉరికి వేలాడదీసి, ఆపై వారిద్దరు కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం ఉదయం సమాచారం మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టానికి తరలించి విచారణ చేపట్టారు. పవిత్ర కోసం గాలిస్తున్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >