Posted on 2025-06-21 15:55:32
డైలీ భారత్, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు ప్రభుత్వం ఒక టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చింది. ఎమర్జెన్సీ సేవల కోసం ఒకే టోల్ఫ్రీ నంబర్ - 112ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఇప్పటి వరకు పోలీస్ సహాయం (100), అంబులెన్స్ (108), మహిళల భద్రత (181).. బాలల హక్కుల పరిరక్షణ (1098), ప్రకృతి విపత్తుల (1077) వంటి విభిన్న సేవల కోసం వేర్వేరు నంబర్లను ప్రజలు ఉపయోగించేవారు.
అయితే ఇప్పుడు వీటి స్థానంలో ఒక్కటే నంబర్ - 112 కొనసాగనుంది. ఈ మార్పుతో అన్ని అత్యవసర సేవలకు వేగంగా.. సమర్థవంతంగా స్పందించేందుకు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. ఇప్పటి నుంచి రాష్ట్రంలో 112 నంబర్ను యాక్టివ్ మోడ్లో అమలు చేస్తున్నామని తెలిపారు. 112 నంబర్కు ఫోన్ చేయగానే, కాల్ కేంద్రం లొకేషన్ను జీపీఎస్ ఆధారంగా ట్రాక్ చేసి.. సంబంధిత పోలీస్ స్టేషన్, అంబులెన్స్ లేదా ఫైర్ సర్వీసులకు సమాచారం పంపుతుంది.
అత్యవసర పరిస్థితుల్లో రిస్పాన్స్ టైమ్ను గణనీయంగా తగ్గించేందుకు అవసరమైన మౌలిక వసతులు, టెక్నాలజీ టూల్స్తో వ్యవస్థను అప్గ్రేడ్ చేశారు. కాల్కు స్పందించడానికి ప్రత్యేకంగా ట్రెయిన్డ్ సిబ్బంది 24/7 విధులలో నియమితులయ్యారు. ఆండ్రాయిడ్ లేదా iOS స్మార్ట్ఫోన్లలో ప్యానిక్ బటన్ని నొక్కినట్లయితే వెంటనే 112కు కాల్ అవుతుందని స్పష్టం చేశారు. అలాగే 112 India Appను డౌన్లోడ్ చేసుకుని, రిజిస్టర్ చేసుకున్నట్లయితే... ఒకే టచ్తో పోలీసులు, అంబులెన్స్, ఫైర్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
మహిళల కోసం ప్రత్యేకంగా SOS ఫీచర్లు, ఫేక్ కాల్ సిస్టమ్ వంటి భద్రతా ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మరోవైపు స్కూళ్లు, కాలేజీలు, కమ్యూనిటీ హాల్స్ లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా, పత్రికలు, టీవీ చానళ్లలో ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ అవగాహన వాహనాల ద్వారా సమాచారాన్ని అందిస్తున్నామని స్పష్టం చేశారు.
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >
గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.
Posted On 2026-04-08 17:28:46
Readmore >
వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం
Posted On 2026-04-08 13:14:54
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్కు తరలింపు
Posted On 2026-04-08 12:27:46
Readmore >