Posted on 2025-07-10 21:11:11
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నెల నెల ప్రభుత్వం వృద్ధులకు ఇచ్చే వృద్ధాప్య పింఛన్ పింఛన్ డబ్బుల కోసం తల్లిని
దారుణంగా కొట్టి చంపాడు తనయుడు. ఈ దారుణ ఘటన నిజామాబాదు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.గురువారం మధ్యాహ్నం వర్ని మండలం జాలాల్ పూర్ గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కధనం ప్రకారం.. జలాల్ పూర్ గ్రామానికి చెందిన మక్కలపల్లి సాయవ్వ (57)కు భర్త చనిపోవడంతో వితంతు పింఛన్ వచ్చేది. సాయవ్వ కొడుకు గత కొన్ని రోజులుగా తనకు తాగుడుకు డబ్బులు లేవని పింఛన్ డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెస్తు గొడవ పడుతున్నాడు. గురువారం మధ్యాహ్నం సాయవ్వతో సాయిలు గొడవ పడి కుర్చీతో తలపై బాదాడు. కిందపడిన సాయవ్వ తలపైన, చాతిపై రాయిని తీసుకుని చావబాదాడు. ఈ ఘటనలో సాయవ్వ తీవ్రంగా గాయపడటంతో సాయిలు వదిలి పారిపోగా, స్థానికులు ఆమెను బోధన్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిశీలించిన వైధ్యులు సాయివ్వ చనిపోయిందని నిర్ధారించారు. ఈ మేరకు వర్ని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >
బాల కార్మికులను గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలి
Posted On 2026-06-12 22:38:10
Readmore >
పాఠశాల పునఃప్రారంభానికి ముందే అన్ని సౌకర్యాలు సిద్ధంగా ఉండాలి : అదనపు కలెక్టర్ డా. అశ్వని తానాజీ వాకడే
Posted On 2026-06-12 21:45:03
Readmore >