Posted on 2025-07-16 16:36:15
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: బుధవారం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆధ్వర్యంలో జిపిఎస్ గుర్బాబాది స్కూల్లో నోట్బుక్స్, పెన్లు, న్యూట్రిషన్ జ్యూస్ పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా అధ్యక్షులు సోడి కృపాల్ సింగ్ హాజరై మాట్లాడుతూ, జీరో స్కూల్ను పునర్జీవనం తీసుకురావడంలో పాఠశాల హెడ్మాస్టర్ చిన్నయ్య స్వామి, వాణి టీచర్లను అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, అందుకే నోట్బుక్స్, పెన్ల పంపిణీ చేయడం జరుగుతుందని, చక్కగా చదువు కొనసాగేలా అన్ని రంగాలలో ముందుకు నడవాలని కోరుకున్నారు. అనంతరం లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ నిర్వాహకులు విద్యార్థులకు నోట్బుక్స్, పెన్లు న్యూట్రిషన్ జ్యూస్ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో అధ్యక్షులు లింబాద్రి, కార్యదర్శి రాఘవేంద్ర బాబు, ఖజానాదారు అంకం రాజేందర్, దాత గురుప్రసాద్ పాల్గొన్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >