Posted on 2025-07-16 20:21:45
వి హెచ్ పి ఎస్ నవీపేట్ మండల అధ్యక్షుడు భయ్యా సతీష్ కుమార్
డైలీ భారత్ న్యూస్ నిజామాబాద్: చేయూత పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం పెంచాలని డిమాండ్ చేశారు. అందుకే ఈనెల 18న నిజాంబాద్ జిల్లా కేంద్రంలో చేయూత, వికలాంగుల, పెన్షన్ దారుల సనహక కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. కావున ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఎన్నికల హామీ ప్రకారం, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ప్రకారం చేయూత పెన్షన్లు 2000 నుంచి 4000, వికలాంగుల పెన్షన్లు 4000 నుంచి 6000, కండరాల క్షీణించిన వారికి 15000 రూపాయలు పెంచుతామని హామీ ఇవ్వడం జరిగిందని వీహెచ్పీఎస్ నవీపేట్ మండల అధ్యక్షుడు సతీష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ హామీ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిరెండు సంవత్సరాలు దగ్గరికి వచ్చిన ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరిస్తుందని అన్నారు.
ఈ అంశాన్ని ప్రజల ముందు ఉంచడానికి ఈ నెల 18న పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో అన్ని సామాజిక పెన్షన్ దారుల, వికలాంగుల మరియు బీడీ కార్మికుల పెన్షన్ దారుల సమావేశం నిజామాబాద్ నగరంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సమావేశానికి జిల్లా నలువైపుల నుంచి పెన్షన్ దారుల వేల సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వి హెచ్ పి ఎస్ నవిపేట్ మండల అధ్యక్షుడు భయ్యా సతీష్ కుమార్ , గంగాధర్ పంతులు , జ్ఞానేశ్వర్ , గోవింద్ , ఎం ఎస్ పి నాయకులు చింతల సాయన్న , సంతోష్ , చరణ్ , అరుణ , అంజలి ,తదితరులు పాల్గొన్నారు.
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >