Posted on 2025-07-20 18:40:55
పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకొని జాతరను తలపించిన కోట గల్లి ప్రాంతం
ప్రత్యేక మొక్కులు చెల్లించుకున్న నూడా చైర్మన్
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఆషాడ మాసం చివరి ఆదివారం పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కోటగల్లి ప్రాంతంలో కోట మైసమ్మ ఆలయ అధ్యక్షుడు అంతిరెడ్డి దేవేందర్ ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా బోనాల ఉత్సవాలు నిర్వహించారు. ఉదయం తెల్లవారుజామున నుండి అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలు భక్తులు నిర్వహించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నూడా చైర్మన్ కేశవేణు, జిల్లా గ్రంథాలయాల చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్ లు హాజరై అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షుడు అంతిరెడ్డి దేవేందర్ మాట్లాడుతూ ఎంతో మహిమగల కోట మైసమ్మ ఆలయంలో భక్తుల కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా ప్రసిద్ధి కెక్కారని కోట గల్లి ప్రాంతవాసులనే కాకుండా ఆ అమ్మవారు నిజామాబాద్ నగర వాసులందరిని కాపాడుతూ వస్తున్నారని ఆయన అన్నారు. అనంతరం నూడా చైర్మన్ కేశ వేణు మాట్లాడుతూ తాను చిన్ననాటి నుండి ఈ అమ్మవారి మహిమను తెలుసుకుంటూ వస్తున్నానని భక్తుల కోరిన కోరికలు తీరుస్తూ వారికి ఎలాంటి ఆపద రాకుండా ఆ అమ్మవారు తోడుగా వారికి అండగా నిలుస్తున్నారని ఇది ఎంతో గొప్ప విషయం అన్నారు.
కామారెడ్డి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్
Posted On 2026-06-14 08:30:06
Readmore >
అశ్వారావుపేట 100 పడకల హాస్పిటల్ త్వరగా పూర్తి చేయాలి : బీజేపీ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-13 20:32:49
Readmore >
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక కాంట్రాక్టులపై తుడుం దెబ్బ ఆందోళన
Posted On 2026-06-13 11:35:06
Readmore >
కాసులకు కక్కుర్తితో అక్రమ కరెంట్ కలెక్షన్స్ ఇస్తున్న అధికారులు
Posted On 2026-06-13 11:33:30
Readmore >
కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్ఎస్ పార్టీలోకి చేరికల గురించి చర్చలు జరిపిన జూలూరుపాడు మండల పాపకొల్లు గ్రామనికి చెందిన కాంగ్రెస్ యువజన నాయకులు
Posted On 2026-06-13 11:31:24
Readmore >
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గంలో మీడియా కమిటీ కార్యదర్శిగా దన్నారపు రాజలింగం నియామకం
Posted On 2026-06-13 11:26:02
Readmore >
రైతుల పొలాలకు చేరాల్సిన చెరువు మట్టి రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలింపు?
Posted On 2026-06-13 11:25:04
Readmore >