Posted on 2025-08-18 13:19:05
వినాయక ప్రతిష్టాపనకు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి
భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఆదేశాల మేరకు, పాల్వంచ డిఎస్పి, సీఐ సూచనలు...
బూర్గంపాడు ఎస్ఐ మేడ ప్రసాద్
డైలీ భారత్, బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఐపీఎస్ ఆదేశాలతో పాల్వంచ డిఎస్పి, పాల్వంచ సర్కిల్ ఇన్స్పెక్టర్ సీఐ, సూచనల మేరకు గణేష్ మండప నిర్వాహకులకు పలు సూచనలు చేసిన బూర్గంపాడు ఎస్ఐ మేడ ప్రసాద్.
వినాయక మండపాల అనుమతి కొరకు https://policeportal.tspolice.gov.in/index.html ఆన్లైన్ లో వివరాలు నమోదు చేయాలని, భద్రత కోసం మండపాల వద్ద 24 గంటలు కమిటీ సభ్యులు ఉండాలని తెలిపారు.
మండలంలో గణేష్ మండపాల దగ్గర అధిక శబ్దం చేసే డీజేలకు అనుమతి లేదని, పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి, విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, గణేష్ కమిటీ సభ్యులు, మండపాల దగ్గర ఎటువంటి గొడవలు జరగకుండా, చూసుకోవలసిన బాధ్యత కమిటీ వారిదే అని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 కు కాల్ చేయాలని ఎస్ఐ మేడ ప్రసాద్ అన్నారుగణేష్ మండపాల నిర్వహణ గురించి బూర్గంపాడు పోలీస్ ఎస్ఐ తెలిపారు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >