Posted on 2025-08-21 21:00:17
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల పరిధిలో ఉన్నటువంటి గ్రామాలలో వినాయక ప్రతిష్ట మరియు మండపాలను నిర్వహించే కమిటీ సభ్యులను సుజాతనగర్ పోలీస్ స్టేషన్ నందు అందరిని ఆహ్వానించి వారికి ఎస్ఐ ఎం .రమాదేవి పలు సూచనలు తెలియజేసినారు
వినాయక మండపాల వద్ద కమిటీ సభ్యులు పాటించాల్సిన నియమ నిబంధనలు గురించి క్రింది విధంగా వివరించి సూచనలు ఇచ్చారు.గణేష్ విగ్రహాలను ప్రతిష్టించుటకు పోలీసు వారు ఇచ్చిన లింక్ నందు లాగిన్ అయ్యి ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలి మండపాల వద్ద అనుమతించిన పరిమితిలోనే లౌడ్ స్పీకర్ల సౌండ్ ఉంచాలి. రాత్రి 10 గంటల తర్వాత బిగ్గరగా సాంగ్స్ ప్లే చేయరాదు.చట్టుపక్కల వారికిఎలాంటి అసౌకర్యo కలిగించరాదు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుండి పర్మిషన్ తీసుకోవాలి.రహదారులను,రోడ్లను మూసివేసే విధంగా మండపాలను రోడ్లకు అడ్డంగా పెట్టరాదుమండపం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి.మండపం వద్ద ప్రతిరోజు ఒక కమిటీ మెంబర్ రాత్రి సమయంలో తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి.భద్రతా ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలి. ట్రాఫిక్ నియమాలను పాటించాలి. పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.విగ్రహ ప్రతిష్ట, విసర్జన తేదీలను,సమయాలను ఖచ్చితంగా నిర్ణయించుకొని పోలీస్ వారికి తెలియజేయాలి.వేడుకలు సామరస్యపూర్వకంగా జరిగేలా చూడాలి. ఏ విధమైన వివాదాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
మండపాల వద్ద DJ లకు అనుమతి లేదు. మండపాల వద్ద ఎలాంటి అవాంచనీయ సంఘటన జరిగినా వెంటనే పోలీస్ వారికి తెలియజేయాలి సుజాతనగర్ ఎస్సై ఎం రమాదేవి అన్నారు ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >