Posted on 2025-08-24 03:59:12
వివాదాలకు, కేరాఫ్ అడ్రస్ గా జిల్లా మెడికల్ కళాశాల
గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన మారని తీరు
మెడికల్ కళాశాలలో సీనియర్ విద్యార్థుల ర్యాగింగ్ కలకలం?
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో దారుణం చోటుచేసుకుంది. ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై సీనియర్లు (పీజీ విద్యార్థులు) ర్యాగింగ్కు పాల్పడ్డారు. సుమారు పది మంది విద్యార్థుల వరకు కలిసి అమాయకుడిని చితకబాదారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది.బాధితుడి కథనం ప్రకారం..
హైదరాబాద్ సమీపంలోని పటాన్చెరుకు చెందిన యువకుడు రాహుల్ నిజామాబాద్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. కాగా, ఇంటర్నల్ డ్యూటీలో భాగంగా బాధిత విద్యార్థి ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వర్తించాడు. అయితే రాహుల్ విధులకు గైర్హాజరైనట్లు సీనియర్లు(పీజీ విద్యార్థులు) రిజిస్టర్లో నమోదు చేశారు. బాధిత విద్యార్థి ఈ విషయమై శనివారం సీనియర్ల వద్దకు వెళ్లి అడిగాడు. తాను డ్యూటీ చేసినా కూడా.. ఎందుకు గైర్హాజరు వేశారని అడిగాడు. దీంతో మమ్మల్నే నిలదీస్తావా.. అంటూ సీనియర్లు బాధిత విద్యార్థిపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. సుమారు అర గంట పాటు ర్యాగింగ్ చేపట్టారు. ప్రశ్నలతో విసిగించారు. ఫోన్ లాగేసుకున్నారు. తనకు ఆరోగ్యం సరిగా లేదు.. జాండిస్ అయ్యాయి.. తనను వదిలేయమని ప్రాధేయపడినా.. వదిలిపెట్టకుండా కొట్టారని బాధిత విద్యార్థి పేర్కొన్నారు. మెడికల్ కాలేజీలో జరిగిన ర్యాగింగ్, మెడికల్ విద్యార్థిపై దాడి విషయం బయటకు రాకుండా కళాశాల అధికారులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. లోలోపలే కాంప్రమైస్ చేసేందుకు బాధిత విద్యార్థిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తప్పు చేసిన సీనియర్ల విషయంలో మెడికో లీగల్ కేసు (ఎమ్మెల్సీ) ఇష్యూ చేసేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు.
విద్యార్థుల్లో సేవాభావం పెంపొందించే స్కౌట్స్ & గైడ్స్ ఉద్యమం : కంకణాల రాంరెడ్డి
Posted On 2026-07-12 16:55:14
Readmore >
బాన్సువాడలో పోలీసు వ్యవస్థకు నూతన ఊపు... రూ.44 లక్షలతో 4 భవనాల ప్రారంభం
Posted On 2026-07-12 16:48:16
Readmore >
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >