Posted on 2025-08-27 11:31:44
డైలీ భారత్, గంభీరావుపేట:రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరవులు, కుంటలు అలుగు దుంకుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల వాగులో పడి ఒకరి గల్లంతయ్యారు. నర్మాల క్యాంపుకు చెందిన పంపుకాడి నాగయ్య బర్లను మేపేందుకు బుధవారం వాగు సమీపానికి వెళ్లారు. భారీ వర్షానికి వాగు ఉధృతంగా ప్రవహించడంతో గల్లంతయినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరో ఐదుగురు సహాయం కోసం ఎదురుచూపు
అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం
బాధితుల కుటుంబాలతో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జ్ కేకే మహేందర్ రెడ్డి తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచన
సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, ఎస్పీ మహేష్ బిగితే & రెస్క్యూ టీం..
సహాయక చర్యలు మొదలు
ఏగువ మానేరు ప్రాజెక్టు దగ్గర వ్యక్తిగల్లంతు
మానేరు వాగులో చిక్కుకున్న రైతులు
ఇంకా ఐదుగురు రైతులు వాగు అవుతలి గడ్డకు చిక్కుకున్నారు...
జంగం స్వామి
పిట్ల నర్సింలు
ధ్యానబోయిన స్వామి
పిట్ల మహేష్
పిట్ల స్వామి
రైతులు చిక్కుకున్నారు....
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >