Posted on 2025-08-27 11:23:11
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: బుధవారం తెల్లవారుజామున మూడు గంటల నుండి కామారెడ్డి జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షానికి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ రోడ్లు స్తంభించాయి. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డి కి వెళ్లే రహదారి దారిలో వరద నీరు దాటికి రోడ్డు కుంగిపోవడంతో అందులో పడి ఓ కారు ఇరుక్కుపోయింది. మరోవైపు రాజాం పేట్ మండల
కొండాపూర్ అరగొండ ఎల్లాపూర్ తండా ఎల్లారెడ్డిపల్లి గుడి తండా చుట్టుపక్క తండాలలో భారీ వర్షపు వరద దాటికి తాండాలలో నివాసం ఉంటున్న ప్రజలు వరద నీటితో ఆ తాండాలు పూర్తిగా జలదిగ్బంధంలో ప్రజలు ఉన్నారు. వెంటనే ప్రభుత్వం జిల్లా అధికారులు స్పందించి తక్షణమే హెలికాప్టర్ సహాయంతో వరద నీటిలో కొట్టుకుపోతున్న బాధితులను కాపాడాలని స్థానికులు వేడుకుంటున్నారు. మరోవైపు ఇటు బిక్కనూరు తలమడ్ల మధ్యలో ఉన్న రైల్వే ట్రాక్ వరద ప్రవాహంతో కొట్టుకపోయినట్లు తెలుస్తుంది.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >