| Daily భారత్
Logo




హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు మరియు 1000/- జరిమానా

News

Posted on 2025-08-28 15:26:40

Share: Share


హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు మరియు 1000/- జరిమానా

జిల్లాలో నేరాలకు పాల్పడిన వారికీ జైలు శిక్ష తప్పదు, శిక్షలతోనే సమాజంలో మార్పు.

నిందుతుడికి శిక్ష పడటంలో కృషి చేసిన అధికారులను , పిపి,సిబ్బందిని అభినందించిన జిల్లా ఎస్పీ.

డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: హత్యకు కారణమైన  నిందుతుడీకి జీవిత ఖైదు, 1000/- రూపాయల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి నీరజ గారు గురువారం రోజున తీర్పు వెల్లడించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

ముస్తాబాద్ మండలం కొండాపూరుకు చెందిన సిర్రం మహేష్ s/o రాజారామ్ age 46y అనే వ్యక్తి వేములవాడలో కిరాయికి ఉంటూ కూలి చేసుకుంటూన్నాడు,అతనికి దర్ర తిరుపతితో పరిచయం ఏర్పడి తన రూమ్ లో ఉంచుకొనగా దర్ర తిరుపతి మద్యంకు బానిస అయ్యి, రూమ్ రెంట్ ఇవ్వకుండా మరియు సిర్రం మహేష్ ని వేధించగా,సిర్రం మహేష్ రెంట్ కట్టి,మద్యం త్రాగకుండా ఉంటేనే రూoలో ఉండు లేదు అంటే రూమ్ నుండి బయటకు వెళ్లగొడుతా అని అందరి ముందు అన్నందుకు,దర్ర తిరుపతి అందరి ముందు నా పరువు తీసిన మహేష్ ను ఎలాగైనా చంపాలి అనే ఉద్దేశ్యంతో 1-4-2024 రోజున రూమ్ లో సిర్రం మహేష్ పడుకున్న సమయంలో దర్ర తిరుపతి పెద్ద సిమెంట్ రాయి తో మహేష్ తల పై భాది చంపాడు.

ఈకేసులో మహేష్ భార్య అయినటువంటి పద్మ ఫిర్యాదు మేరకు అప్పటి వేములవాడ టౌన్ ఇంచార్జి CI శ్రీనివాస్ (వేములవాడ రూరల్ )కేసు నమోదు చేసి నిందితుడు రిమాండ్ కు పంపించడం జరిగింది.తరువాత సిఐ వీరప్రసాద్ కేసు దర్యాప్తు అనంతరం కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. 

కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీంద్ర నాయుడు ఆధ్వర్యంలో కోర్టు కానిస్టేబుల్ మహేందర్,సి ఎం ఎస్ కానిస్టేబుల్ నవీన్ లు కోర్టులో 17 మంది సాక్షులను ప్రవేశపెట్టగా ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్ వాదించారు కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడైన దర్ర తిరుపతికి జీవిత ఖైదీతో పాటు1000/- రూపాయల జరిమానా విధించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...

సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని,శిక్షలతోనే సమాజంలో మార్పు వస్తుందని, పోలిసులు మరియు ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ మరియు న్యాయ నిరూపణ జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు.పైకేసులో నిందితులకి శిక్ష పడటంలో కృషి చేసిన అప్పటి విచారణ అధికారి సీఐలు వీరప్రసాద్,శ్రీనివాస్ ప్రస్తుత సి.ఐ వీరప్రసాద్,పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెంట శ్రీనివాస్,కోర్టు మానిటరింగ్ ఎస్సై రవీంద్ర నాయుడు,కోర్టు కానిస్టేబుల్ మహేందర్,సి ఎం ఎస్ కానిస్టేబుల్ నవీన్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.

Image 1

విజయవాడ ఆటోనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం... 7 బస్సులు దగ్ధం

Posted On 2026-07-12 10:39:25

Readmore >
Image 1

కామారెడ్డి పట్టణంలో రెడ్డి చికెన్ మార్కెట్ ప్రారంభం

Posted On 2026-07-12 09:55:45

Readmore >
Image 1

ముఖ్యమంత్రి పీఠంపై ఉండి హుందాతనం కోల్పోయిన రేవంత్ రెడ్డి

Posted On 2026-07-12 09:34:30

Readmore >
Image 1

తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్

Posted On 2026-07-12 03:35:06

Readmore >
Image 1

ప్రముఖ లెజెండరీ సింగర్ ఎస్.జానకి కన్నుమూత

Posted On 2026-07-11 17:25:49

Readmore >
Image 1

ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు

Posted On 2026-07-11 17:04:24

Readmore >
Image 1

సిరిసిల్లలో ఆస్తి కోసం మేనమామ హత్య... నిందితుడు అరెస్ట్

Posted On 2026-07-11 16:48:18

Readmore >
Image 1

నిందితుడిని పోలీసులే కాపాడుతున్నారు...బాలిక మేనమామ నరేష్

Posted On 2026-07-11 16:27:29

Readmore >
Image 1

జూదంపై బిచ్కుంద పోలీసులు దాడి... ముగ్గురు పట్టివేత

Posted On 2026-07-11 15:49:13

Readmore >
Image 1

పొల్యూషన్ సర్టిఫికెట్‌పై వాహనదారులకు ఊరట!

Posted On 2026-07-11 15:19:25

Readmore >