Posted on 2025-08-28 16:22:09
డైలీ భారత్, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా బోరజ్ మండలం డొలారా వద్ద జాతీయ రహదారిపై జైనథ్ సీఐ సాయినాథ్, కానిస్టేబుల్ షబ్బీర్ లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అతి వేగంగా వచ్చిన కంటైనర్ వీరి వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సీఐ, కానిస్టేబుల్ లు గాయపడ్డారు. వారిని ఆదిలాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అదే విధంగా.. గాయపడ్డ ఎస్సై, కానిస్టేబుల్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆస్పత్రికి చేరుకుని పరామర్శించారు.
తెలంగాణకు మూడు బులెట్ ట్రైన్స్ : కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
Posted On 2026-07-12 03:35:06
Readmore >
ఆరుగురిని చంపిన నిందితుడిపై రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు
Posted On 2026-07-11 17:04:24
Readmore >