Posted on 2023-12-26 19:01:04
డైలీ భారత్, ఇందల్వాయి: నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద లారీ బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాడు..
అనంతరం లారీ టోల్ ప్లాజా కౌంటర్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు టోల్ ప్లాజా సిబ్బంది, కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించిన టోల్ ప్లాజా సిబ్బంది.. బాధితులను నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కౌంటర్లోకి దూసుకెళ్లిన లారీని క్రేన్ సాయంతో తొలగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు..
నకిలీ "షాదీ ముబారక్" లబ్ధిదారులను సృష్టించి ప్రభుత్వ నిధులను మళ్లించినందుకు ఆరుగురి అరెస్టు
Posted On 2026-06-14 20:18:49
Readmore >
దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
Posted On 2026-06-14 14:08:47
Readmore >
ఘనంగా భీమారం గ్రామ సర్పంచ్ గీత వీరేశం గుప్త జన్మదిన వేడుకలు
Posted On 2026-06-14 13:54:26
Readmore >
ఇందిరమ్మ ఇళ్ళను పరిశీలించిన బిజెపి నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి
Posted On 2026-06-14 13:11:06
Readmore >