Posted on 2025-09-25 15:19:35
డైలీ భారత్, రాజన్న సిరిసిల్ల: శ్రీనగర్ కాలనీ లో నిన్న వచ్చిన వరద కాలువ నీరు ఇండ్ల చుట్టూ చేరి ముంపునకు గురయ్యాయి ఆ నీటితో పాటు విషపూరిత పాములు వస్తున్నాయి. ఇప్పుడు కొండచిలువలు ఇండ్ల మద్యలోకి వచ్చి తిరుగుతున్నాయి. అధికారులు, నాయకులు ఇప్పుడైనా స్పందించి ఎవరికి ఏ అపాయం కలగకముందే నీళ్లు రాకుండా తగిన చర్యలు తీసుకొగలరు అని కాలనీవాసులు కోరుతున్నారు.
సిరిసిల్ల పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో ఏడు అడుగుల భారీ కొండచిలువ ప్రత్యక్షమవ్వడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కొత్తచెరువు నుండి నీటిని వదలడం వల్లే కొండచిలువ వచ్చిందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజులలో భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కొత్తచెరువు నుండి నీరు అధికంగా కాలనీలోకి వస్తుందని దాని వలన ఇంకా ఎన్ని విపత్తులు వస్తాయో అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి తగు చర్యలు తీసుకోవాలని శ్రీనగర్ కాలనీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు నవీన్ కోరారు. రక్షణ కల్పించాలని వారు అధికారులను కోరుతున్నారు.
యూనిఫాం, అవినీతి రెండూ కలిసి ఉండలేవు... డైరెక్టర్ జనరల్ అఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి
Posted On 2026-04-09 06:18:50
Readmore >
తమిళనాడు ప్రధాన కార్యదర్శి గా తెలుగు వ్యక్తి ఎం.సాయికుమార్ బాధ్యతలు స్వీకారం
Posted On 2026-04-09 06:00:41
Readmore >
అర్థరాత్రి వేళ ఆపన్నహస్తం.. ""ఆపరేషన్ కవాచ్" తో సురక్షితంగా తల్లి ఒడికి బాలుడు!
Posted On 2026-04-08 17:33:40
Readmore >
గర్భిణీ స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సరైన వైద్య సేవలు పొందాలి : జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి.
Posted On 2026-04-08 17:28:46
Readmore >
వరద ముంపునకు గురైన గిరిజన గురుకుల పాఠశాల నాగిరెడ్డిపేట్ కు గ్రీన్కో ఫౌండేషన్ ఆపన్నహస్తం
Posted On 2026-04-08 13:14:54
Readmore >
రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రేమ-పెళ్లి పేరుతో యువతిని వేధిస్తున్న యువకుడు అరెస్ట్,రిమాండ్కు తరలింపు
Posted On 2026-04-08 12:27:46
Readmore >