Posted on 2025-10-03 14:34:36
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సంకల్పంతో ప్రారంభమైన “అలయ్ బలయ్” వేడుకలు గత రెండు దశాబ్దాలుగా విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు బండారు విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, “విజయదశమి తర్వాత రోజు తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల విశిష్టతను భవిష్యత్ తరాలకు పరిచయం చేయాలనే లక్ష్యంతో బండారు దత్తాత్రేయ ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కులాలు, మతాలు, రాజకీయాలు, ప్రాంతాలు అన్నవన్నీ అతీతంగా అందర్నీ ఒకే వేదికపైకి తీసుకురావడం దత్తన్న గారికే సాధ్యం. ఆయన నిజమైన అజాతశత్రువు. తెలుగు రాష్ట్రాల్లోనే కాక దేశవ్యాప్తంగా అందరికీ ఆదర్శంగా నిలిచారు,” అని తెలిపారు. అలాగే ఆయన కుమార్తె విజయలక్ష్మి అదే స్పూర్తితో ఈ వేడుకలను కొనసాగించడం ఎంతో శుభ పరిణామమని అన్నారు. భవిష్యత్తులో కూడా అలయ్ బలయ్ వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత ఘనంగా నిర్వహించాలని కోరుకుంటున్నట్లు ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పేర్కొన్నారు.
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >