| Daily భారత్
Logo




కామారెడ్డి లో దసరా వేళ కలకలం రేపిన డాడుల ఘటనపై పోలీసుల విచారణ ముమ్మరం

News

Posted on 2025-10-04 18:12:30

Share: Share


కామారెడ్డి లో దసరా వేళ కలకలం రేపిన డాడుల  ఘటనపై పోలీసుల విచారణ ముమ్మరం

నిందితుల్లో ఒకరిని అరెస్టు చేసిన పోలీసులు

కామారెడ్డి సబ్ డివిజన్ ఎస్పీ చైతన్య రెడ్డి వెల్లడి..

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:విజయదశమి రోజు అర్ధరాత్రి కలకలం రేపిన దాడుల ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. ఘటనకు కారకులైన ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు.

ఈ మేరకు శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కామారెడ్డి సబ్​ డివిజన్​ ఏఎస్పీ చైతన్య రెడ్డి వివరాలు వెల్లడించారు. విజయదశమి రోజు అర్ధరాత్రి తమకు ‘100’కు కాల్ వచ్చిందని, వెంటనే తమ సిబ్బంది ఆ ప్రాంతానికి వెళ్లగా.. అక్కడ రెండు గ్రూప్​లు కొట్టుకుంటున్నాయని తెలిపారు. ఈ ఘటనలో పలువురిని అదుపులోకి తీసుకుని విచారించగా గాజుముక్కతో దాడి జరిగినట్లు తేలిందన్నారు. అలాగే కేతన్, ప్రఫుల్ అనే ఇద్దరు యువకులపై సిద్దార్థ్ అనే వ్యక్తి పాత కక్షల నేపథ్యంలో గాజు ముక్కతో దాడి చేశాడన్నారు. ఈ దాడిలో నలుగురికి గాయాలయ్యాయని, సిద్దార్థ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించినట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా వదిలిపెట్టేది లేదని ఏఎస్పీ హెచ్చరించారు. సమావేశంలో పట్టణ సీఐ నరహరి పాల్గొన్నారు.

Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >