| Daily భారత్
Logo




బిసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

News

Posted on 2025-10-05 14:10:18

Share: Share


బిసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి : ఎమ్మెల్సీ మల్క కొమరయ్య

డైలీ భారత్ న్యూస్, హైదరాబాద్:జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య  ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని లక్డీకపూల్ అశోక హోటల్‌లో బీసీ ప్రజాప్రతినిధులు, కుల సంఘాల నేతలతో కూడిన అఖిల పక్ష సమావేశం  జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్క కొమరయ్య మాట్లాడుతూ" రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని"  కోరారు. అలాగే చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్‌తో పాటు విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో బీసీలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని ఎమ్మెల్సీ మల్క కొమరయ్య డిమాండ్ చేశారు. బీసీలు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వారికి తగిన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది.. ఈ పోరాటంలో తనవంతు సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తాను అని మల్క కొమరయ్య స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు.


Image 1

ఎస్సీ సెల్ జూలూరుపాడు మండల అధ్యక్షుడు గా మంద బాబు

Posted On 2026-07-10 06:26:41

Readmore >
Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >