Posted on 2025-10-06 14:13:02
డైలీ భారత్, హైదరాబాద్:వరంగల్కు చెందిన ఎంబీబీఎస్ విద్యార్థి గణేశ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా నిలిచారు. తక్షణ ఆర్థిక సాయంగా రూ.1.5లక్షలను అందజేశారు.
వరంగల్కు చెందిన గణేశ్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను, తోబుట్టువును కోల్పోయాడు. దీంతో అమ్మమ్మ ఇంట్లోనే పెరిగాడు. ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కాలేజీల్లోనే చదివినప్పటికీ కష్టపడ్డాడు. ఎంబీబీఎస్ సీటు కూడా సాధించాడు. కానీ మెడికల్ కాలేజీలో జాయిన్ అవ్వాలంటే ట్యూషన్ ఫీజు, డిపాజిట్ కింద రూ.1.5 లక్షలను కట్టాల్సి ఉంది. ఈ నెల 6వ తేదీలోపు ఆఫీజును కట్టాల్సి ఉంది. కానీ తల్లిదండ్రులు లేని గణేశ్ ఆ మొత్తాన్ని చెల్లించే స్థితిలో లేడు. ఒకవేళ సమయానికి ఫీజు కట్టకపోతే సీటు కోల్పోయే అవకాశం ఉంది. దీంతో గణేశ్ ట్విట్టర్(ఎక్స్) వేదికగా సాయం కోరాడు. దీనికి స్పందించిన కేటీఆర్.. సాయం చేస్తానని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.
ఇచ్చిన మాట ప్రకారం మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. తక్షణ సాయంగా రూ.1.5 లక్షల సాయం అందజేశారు. భవిష్యత్తులో గణేశ్ చదువులకు తానే అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి
Posted On 2026-07-10 03:55:48
Readmore >
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >