| Daily భారత్
Logo




అవసరం ఉన్నవారికి అవయవ శరీర దానం చేయడమే తమ లక్ష్యం

News

Posted on 2025-10-07 13:00:15

Share: Share


అవసరం ఉన్నవారికి అవయవ శరీర దానం చేయడమే తమ లక్ష్యం

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మృతి చెందిన వారి నుండి తమ సంస్థ 2013 నేత్రాలు సేకరించి కండ్లు లేని వారికి దానం చేశాం..

అమ్మ నేత్ర, అవయవ, శరీర దాన ప్రోత్సాహకుల వ్యవస్థాపక అధ్యక్షులు గంజి ఈశ్వర లింగం శారద వెల్లడి

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని సుభాష్ నగర్ లో గల తెలంగాణ ఆల్ పెన్షనర్స్ భవన్ లో ఏర్పాటుచేసిన అవయవదానం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమ్మ ఐ ఆర్గాన్, బాడీ డొనేషన్ ప్రసాద్ ఉమ్మడి రాష్టల వ్యవస్థాపక అధ్యక్షుడు గంజి ఈశ్వర లింగం శారద హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ తమ సంఘం 2016లో ఎన్జీవో సంస్థ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా ఇప్పటివరకు తమ సంఘం ద్వారా కళ్ళులేని వారికి మరణించిన వ్యక్తుల నుండి వారి కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు వారి కళ్ళను తీసుకోవడం జరిగిందని ఇలా తీసుకొని 2013 మందికి కంటి చూపును అందించామని ఆయన అన్నారు. అదేవిధంగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల నుండి 12 కిడ్నీలు, ఆరు కాలేయాలు, ఒక గుండెను తెలంగాణ జీవన్దాన్ ద్వారా పేషెంట్లకు అవయవ మార్పిడి చేయడం జరిగిందన్నారు. అలాగే 227 పార్దివదేహాలను మృతుల బంధువుల అంగీకారం మేరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం దానం చేయడం జరిగిందన్నారు. అలాగే రెండు చర్మదానాలు, చేశామన్నారు అవగాహన సదస్సులు రెండు రాష్ట్రాల్లో నిర్వహించామన్నారు జనవిజ్ఞాన వేదిక, ఆల్ పెన్షనర్స్  రిటైర్డ్ అసోసియేషన్, మల్లు స్వరాజ్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిజామాబాద్ జిల్లాలో నిర్వహించటానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు నర్రా రామారావు తెలంగాణ ఆల్ రిటైర్డ్ అసోసియేషన్ వివాహకులు రామ్మోహన్ రావు, ఈవీఎల్ నారాయణ, శిర్ప హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు.

Image 1

తెలంగాణను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం : ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి

Posted On 2026-07-10 03:55:48

Readmore >
Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >