Posted on 2025-10-10 14:33:39
జిల్లా పర్యటనకు వచ్చిన సీఎంకు వినతి పత్రం అందించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రూరల్ ఎమ్మెల్యే మాతృమూర్తి ద్వాదశ దినకర్మ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా వచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కలెక్టరేట్ ప్రాంగణంలోని హెలిప్యాడ్ వద్ద నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ముఖ్యమంత్రికి అర్బన్ నియోజకవర్గం అభివృద్ధికై నిధులు వెచ్చించాలని వినతిపత్రం అందించారు. జిల్లా కేంద్రంలో పేద విద్యార్థుల చదువు కోసం ఇంటిగ్రేటెడ్ స్కూలు త్వరగా ఏర్పాటు చేసి విద్యార్థులకు అందుబాటులో కి తీసుకురా వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. అలాగే నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం వంద కోట్ల నిధులు మంజూరు చేయాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. అలాగే నగర శివారులోని నాగారం లో ఉన్న డబుల్ బెడ్ రూమ్ లను అదేవిధంగా చంద్రశేఖర్ కాలనీ సమీపంలో ఉన్న అభయహస్తం కాలనీలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు అన్ని వస్తువులతో కూడిన పరికరాలు కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా అన్ని డిపార్ట్మెంట్ లకు సంబంధించిన వైద్యులు జిల్లా ఆస్పత్రి లో ఉండే విధంగా తక్షణమే వైద్యులను నియమించాలని ఆయన కోరారు. అలాగే నిజామాబాద్ బస్టాండ్ ను ఆధునికరించేందుకు ప్రత్యేక నిధులు వెచ్చించి అందరికీ అన్ని వసతులతో కూడిన విధంగా ప్రత్యేక బస్టాండ్ ఏర్పాటు చేయాలని వినతి పత్రంలో సీఎంకు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా విన్నవించారు.
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >