| Daily భారత్
Logo




రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ని పరామర్శించిన మంత్రి వేవిక్ వెంకట స్వామి, వర్ధన్న పేట్ ఎమ్మెల్యే నాగరాజు

News

Posted on 2025-10-12 18:12:24

Share: Share


రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ని పరామర్శించిన మంత్రి వేవిక్ వెంకట స్వామి, వర్ధన్న పేట్ ఎమ్మెల్యే నాగరాజు

రేకులపల్లి లక్ష్మీ నర్సమ్మ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి వివేక్ వెంకట స్వామి,ఎమ్మెల్యే నాగరాజు

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నగరంలోని కంటేశ్వర్ బైపాస్  లోగల నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో  నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసన సభ్యులు డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి ని తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వేవిక్ వెంకట స్వామి, వర్ధన్న పేట్ ఎమ్మెల్యే నాగరాజు ఆదివారం  పరామర్శించారు.

నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి మాతృమూర్తి రేకులపల్లి లక్ష్మీ నర్సమ్మ గత నెల 29న మృతిచెందిన విషయం తెలిసిందే. 

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి, వర్ధన్న పేట్ ఎమ్మెల్యే నాగ రాజు భూపతి రెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భూపతి రెడ్డి మాతృమూర్తికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కో ఆపరేటివ్ యూనియన్ చైర్మన్,  డీసీసీ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి,  పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్,పీసీసీ అధికార ప్రతినిధి వేణు యాదవ్,డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకులు భోజన్న, ఉమ్మాజీ నరేష్,ఎ ఎం సీ భాగరెడ్డి, మాజీ సర్పంచ్ మోహన్, నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సొసైటీ చైర్మన్లు, డైరెక్టర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Image 1

తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్

Posted On 2026-07-09 15:56:35

Readmore >
Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >