Posted on 2025-10-12 19:24:50
డైలీ భారత్, భద్రాద్రి కొత్తగూడెం: బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అక్టోబర్ 14వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా బంద్ నిర్వహించబడనుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ బంద్ను సంపూర్ణంగా జయప్రదం చేయాలని జిల్లా నాయకులు పిలుపునిచ్చారు.
నేతలు తెలిపారు — రాష్ట్ర జనాభాలో బీసీలు సగానికి పైగా ఉన్నప్పటికీ, రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో వారికీ సరైన ప్రతినిధిత్వం లేకపోవడం విచారకరం. ప్రభుత్వాలు బీసీల వాస్తవ స్థితిని గుర్తించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయని పేర్కొన్నారు.
ఇక మౌనం సరి కాదు. బీసీల హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం అందరం ఒక్కటిగా నిలబడి, అక్టోబర్ 14న జరిగే బంద్ విజయవంతం చేయాలి. ఇది బీసీల గౌరవం కోసం జరగబోయే ఉద్యమం” అని నేతలు పిలుపునిచ్చారు.సంఘం నాయకులు విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ఎస్సీ–ఎస్టీ నాయకులు అందరూ బంద్లో చురుకుగా పాల్గొని తమ మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.బీసీల ఆర్థిక, విద్యా, రాజకీయ స్థితి క్షీణిస్తోంది. ప్రభుత్వ పథకాల నుండి బీసీలు పక్కనపడుతున్నారు. ఈ బంద్ ద్వారా ప్రభుత్వం కళ్ళు తెరచి చట్టబద్ధమైన రిజర్వేషన్లు అమలు చేయాలి” అని అన్నారు.
కొదుమూరి సత్యనారాయణ – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కురిమెల్ల శంకర్ – జిల్లా అధ్యక్షుడు
భూపతి శ్రీనివాసరావు – జిల్లా ప్రధాన కార్యదర్శి
బండి రాజ్ గౌడ్ – జిల్లా ఉపాధ్యక్షుడు
పితాని సత్యనారాయణ – జిల్లా గౌరవ అధ్యక్షుడు
రాజేశ్వరి రాష్ట్ర సంఘం మహిళా నాయకురాలు
కొంపల్లి మునీల – జిల్లా మహిళా అధ్యక్షురాలు
మల్లెల ఉషారాణి – గౌరవ సలహాదారుబీసీల హక్కుల కోసం – సామాజిక న్యాయం కోసం – అక్టోబర్ 14 బంద్ను విజయవంతం చేద్దాం!”
తలసేమియా లైఫ్ సేవర్ అవార్డును అందుకున్న వాసవి క్లబ్ బీబీపేట్
Posted On 2026-07-09 15:56:35
Readmore >
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >