| Daily భారత్
Logo




నిజామాబాద్ అర్బన్, నగర కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా బ్లాక్ A, బ్లాక్ B ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం

News

Posted on 2025-10-16 14:06:10

Share: Share


నిజామాబాద్ అర్బన్, నగర కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా బ్లాక్ A, బ్లాక్ B ముఖ్య కార్యకర్తలతో సన్నాహక సమావేశం

డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించిందన్నారు. పార్టీ కోసం శ్రమించి కష్టపడి విధేయతగా ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందని, ఇందులో భాగంగానే నిజామాబాద్  నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని ఎన్నిక కోసం నిజామాబాదు అర్బన్ నియోజకవర్గ విస్తృత స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిజామాబాద్ పట్టణంలోని హరిత హోటల్ లో నిర్వహించారు. ఏఐసిసి అబ్జర్వర్  రిజ్వాన్ అర్షద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, నిజామాబాద్ పట్టణ ఇంచార్జ్ ఎమ్మెల్సీ వెంకట్ బాల్మూర్, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్, రవి బాబు, పాల్గొన్నారు.నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించి  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, జిల్లా అనుబంధ సంఘా అధ్యక్షులుతో డివిజన్ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ల తోసమావేశం నిర్వహించి వారి అభిప్రాయాన్ని స్వీకరించారు. అధ్యక్ష పదవి కోరుకునే వారి ద్వారా దరఖాస్తులకు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని  14 సంవత్సరాలుగా ఎలాంటి ప్రలోభాలకు బెదిరింపులకు భయపడకుండా ముందుకు నడిపించిన కేశ వేణు కి అభినందనలు తెలిపారు. సంఘటన్ సృజన్ అభియాన్ దేశవ్యాప్త కార్యక్రమం ఇది పార్టీని పటిష్టం చేయడానికి పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించి వారికి పదవులు ఇవ్వడానికి, దేశవ్యాప్తంగా యువత, మహిళలు, అణగారిన వర్గాల గొంతుక వినిపించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రజల కోసం పోరాడుతుంది అని చెప్పారు. ఏఐసిసి అబ్జర్వర్ రిజ్వాన్ ఆర్షద్  మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతం కులం, మతం సంబంధం లేకుండా సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని అందరినీ కలుపుకుని పోతుందని ఆయన  చెప్పారు.బిజెపి ప్రభుత్వంలో కులమతాలను రెచ్చగొడుతూ ఒక నాలుగు కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతుందని, ఆధాని అంబానీల చేతిలో ప్రభుత్వం నడిపించే రిమోట్ ఉందన్నారు. రాబోయే రోజుల్లో కేంద్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, పేద ప్రజలకు కావలసింది చేస్తుందన్నారు. పార్టీని అట్టడుగు స్థాయి నుండి పునర్ నిర్మిస్తున్నామన్నారు. పట్టణం, జిల్లాలోని ప్రతి నియోజకవర్గము తాలూకా, మునిసిపాలిటీ మరియు మునిసిపల్  వార్డులను సందర్శించి, అట్టడుగు స్థాయి కార్యకర్తలతో సంప్రదించి, కొత్త స్థానిక నాయకులను నియమిస్తారన్నారు. యువకులు, విద్యావంతులు,సైద్ధాంతిక నిబద్ధత కలిగిన వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంధన్నారు.ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంటాం మా పర్యటన తర్వాత,  నియామకాలను ఖరారు చేయడానికి జాతీయ మరియు రాష్ట్ర నాయకత్వానికి నివేదికలు సమర్పించబడతాయి. రాజ్యాంగ విలువలు, రాజ్యాంగాన్ని కాపాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు


Image 1

పోలీసు స్టేష‌న్ స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

Posted On 2026-07-08 19:27:58

Readmore >
Image 1

మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

Posted On 2026-07-08 14:21:40

Readmore >
Image 1

సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు

Posted On 2026-07-08 14:18:42

Readmore >
Image 1

వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి

Posted On 2026-07-08 07:55:23

Readmore >
Image 1

ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త

Posted On 2026-07-08 07:13:19

Readmore >
Image 1

రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు

Posted On 2026-07-07 14:17:19

Readmore >
Image 1

పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు

Posted On 2026-07-07 14:05:48

Readmore >
Image 1

ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్‌ ఎక్కించి భర్తను చంపేసిన భార్య

Posted On 2026-07-07 14:04:52

Readmore >
Image 1

ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ

Posted On 2026-07-07 14:03:47

Readmore >
Image 1

ప్రభుత్వ పాఠశాలలకే పిల్లలను పంపిద్దాం

Posted On 2026-07-07 08:21:25

Readmore >