Posted on 2025-10-18 06:45:11
పాత కేసుల్లో పరారీలో ఉన్న నిందితున్ని పట్టుకొని వస్తుండగా ఘటన
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్:నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. నిజామాబాద్ నగరంలోని కిల్లా రోడ్ ప్రాంతానికి చెందిన రియాజ్ అనే పాత నిందితుడిని సిసిఎస్ ఎస్ఐ భీమ్రావు, కానిస్టేబుల్ ప్రమోద్ ఇద్దరు కలిసి శుక్రవారం కిల్లా రోడ్డులో పట్టుకొని యాక్టివా ద్విచక్ర వాహనం పై సిసిఎస్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఈ క్రమంలో వినాయక నగర్ ప్రాంతానికి రాగానే, నిందితుడు రియాజ్ తన వద్ద ఉన్న కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణంగా పొడిచాడు. కత్తిపూట్లతో తీవ్ర రక్తస్రావమైన సదరు కానిస్టేబుల్ మృతి చెందాడు. కానిస్టేబుల్ ను దారుణం గా కత్తితో పొడిచిన అనంతరం నిందితుడు రియాజ్ అక్కడి నుండి పరారయ్యాడు. నిండుతుడి కోసం పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడు ఆచూకీ తెలిసినవారు వెంటనే డయల్ 100 కు లేదా దగ్గరలోని పోలీసులకు సమాచారం ఇవ్వగలరు పోలీసు అధికారులు వెల్లడించారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >