Posted on 2025-10-22 16:49:46
డైలీ భారత్ న్యూస్ నిజమాబాద్: తెలంగాణ రాష్ట్ర డి.జి.పి ఉత్తర్వుల మేరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా బుధవారం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అమరులైన పోలీస్ కుటుంబ సభ్యులను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య, ఐ.పీ.ఎస్ వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులను కలిసి అమరుల ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులతో ప్రభుత్వం నుంచి అందిన సహాయ సహకారాల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇంకా ఏమైనా ప్రభుత్వం నుండి సహాయ సహకారం కావాల్సిన ఇంకా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నను తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు. అమరులైన పోలీస్ కుటుంబాలకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని వారి బాగోగులను పర్యవేక్షించాలని తెలిపారు. వారి కుటుంబాలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని మరియు ఎలాంటి సమస్యలు ఉన్నను నా దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) బస్వారెడ్డి, నిజామాబాద్ ఏ సి.పి రాజ వెంకటరెడ్డి, ,ఎన్.ఐ.బి ఇన్స్పెక్టర్ వెంకటయ్య, రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ ఆరిఫ్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకిల్ పాషా, సిబ్బంది పాల్గొన్నారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >