Posted on 2025-10-27 12:47:56
20 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు అపహరణ
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: నవీపేట్ మండల కేంద్రంలోని బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది. ఈ చోరీలో దాదాపు 20 లక్షల రూపాయల విలువ చేసే బంగారం, వెండి ఆభరణాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన ఆదివారం అర్ధరాత్రి తర్వాత చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నవీపేట్ మండల కేంద్రంలోని వైష్ణవి జువెలరీ షాప్ సెట్టర్ ను దొంగలు గ్యాస్ కట్టర్ తో ధ్వంసం చేసి లోనికి చొరబడ్డారు. అందులో ఉన్న బంగారం తో పాటు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం షాప్ యజమాని అక్కడికి చేరుకోగా సెట్టర్ ధ్వంసం చేసి ఉండడంతో చోరీ జరిగినట్లు భావించి వెంటనే నవీపేట్ పోలీసులకు సమాచారం అందించారు. నవీపేట్ ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీమ్ ను రప్పించి చోరీకి పాల్పడ్డ వారి వేలిముద్రలు సేకరించారు. పోరుగునే ఉన్న మహారాష్ట్రకు చెందిన దొంగల గ్యాంగ్ గా పోలీసులు అనుమానించి ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >