Posted on 2025-10-27 15:09:36
గొంతు మార్చి, ప్రజలను ఏమార్చి మోసం చేస్తున్న ఘరానా మోసగాడి అరెస్ట్
అమ్మాయిల గొంతుతో మాట్లాడుతూ సైబర్ మోసం చేస్తూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఘరానా ముఠా అరెస్ట్
రూ 1.5 లక్షలు, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం
రెండు రోజుల్లో చేదించిన ఆదిలాబాద్ జిల్లా పోలీసులు.
నల్గొండలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన జిల్లా పోలీస్
వివరాలను వెల్లడించిన ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి
చాకచక్యంగా వ్యవహరించిన సైబర్ సెల్
డైలీ భారత్, ఆదిలాబాద్ జిల్లా:స్థానిక ఆదిలాబాద్ ఒకటి ఒకటైన పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికా సమావేశంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి మాట్లాడుతూ, బాధితుడు తన వివాహానికై ఆన్లైన్ నందు మరియు యుట్యూబ్ నందు వివాహ వధువుల కొరకై శోధిస్తున్న సమయంలో కృష్ణవేణి అనే అమ్మాయి ఫోటోతో యూట్యూబ్ నందు రూపవత్ శ్రావణ్ కుమార్ అనే వ్యక్తి బాధితునికి పరిచయమై కృష్ణవేణి అనే అమ్మాయి ఉందని నమ్మబలికి మాలోత్ మంజి అనే మోసగాని పరిచయం చేశాడు. ప్రధాన నిందితుడు మాలోత్ మంజి బాధితున్ని కృష్ణవేణి అనే అమ్మాయి పేరుతో, మహిళ గొంతుతో మాట్లాడి తను ఒక ధనవంతురాలని తన ఆస్తులు కోర్టు నందు చిక్కుకురాయని నమ్మబలికి, లాయర్ కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అదేవిధంగా వారి వివాహం తర్వాత తన ఆస్తులను తన వ్యాపారాన్ని బాధితుడు పూర్తిగా చూసుకోవాలి అని చెప్పి, అతని వద్దనుండి విడతలవారీగా ఎనిమిది లక్షల రూపాయలను మోసం చేసి తస్కరించడం జరిగింది అని తెలిపారు. అదేవిధంగా తనకు బంగారం వ్యాపారాలు ఉన్నాయని వాటన్నింటిని నువ్వే చూసుకోవాలని నమ్మించడం జరిగింది అని తెలిపారు. ఈ సందర్భంలో మహిళ గొంతుతో మాట్లాడిన ప్రధాన నిందితుడి మోసంలో పడిన బాధితుడు తనకు విడుదలవారీగా ఎనిమిది లక్షలు ఇచ్చి మోసపోవడం జరిగిందని 1930 ద్వారా సైబర్ ఫిర్యాదు చేయగా, ఈనెల 25వ తారీఖున ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి విచారణ చేపట్టి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన ఐపిఎస్ ప్రత్యేక ఆదేశాల మేరకు, సైబర్ సెల్ మరియు వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ప్రత్యేక బృందం సూర్యాపేట జిల్లా వద్ద నుండి ముగ్గురు నిందితులను పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. మీరు వద్దనుండి ఒకటిన్నర లక్షల రూపాయల నగదు మరియు మూడు మొబైల్స్ ఫోన్ లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో wps ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, సైబర్ సెల్ ఎస్ ఐ గోపికృష్ణ, వన్ టౌన్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ గోకుల్ జాదవ్, హెడ్ కానిస్టేబుల్ ఏ రమేష్, ఐటీ సెల్ కానిస్టేబుల్ అన్వేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నిందితుల వివరాలు...
A1. మాలోత్ మంజి @ కృష్ణవేణి (21) s/o బాలు, రామచంద్రపురం తండా, మఠంపల్లి మండల్, సూర్యాపేట జిల్లా.
A2. బుక్య గణేష్ (19) s/o శ్రీను,రామచంద్రపురం తండా, మఠంపల్లి మండల్, సూర్యాపేట జిల్లా.
A3. రూపవత్ శ్రావణ్ కుమార్ (18) s/o శంకర్, రామచంద్రపురం తండా, మఠంపల్లి మండల్, సూర్యాపేట జిల్లా.
వివరాలలో...
మద్దతు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన ఎం లక్ష్మీకాంత్ ఫిర్యాదు మేరకు ఈనెల 25వ తారీఖున ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >