Posted on 2025-10-27 14:59:15
డైలీ భారత్ న్యూస్, నిజామాబాద్: ఇటీవల రౌడీషీటర్ రియాజ్ చేతిలో మృతి చెందిన సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోట్ కుటుంబాన్ని సోమవారం సాయంత్రం నిజామాబాద్ ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ లు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆ కుటుంబానికి ఎంపీ ధైర్యం చెప్పారు. ఎలాంటి కష్టాలు ఇబ్బందులు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని ప్రమోట్ కుటుంబ సభ్యులను కోరారు. అదేవిధంగా రెండు లక్షల రూపాయల చెక్కును ఆర్థిక సాయం కింద అందజేశారు. అలాగే ప్రమోద్ పెద్ద కుమారుడు ఓ ప్రైవేట్ విద్యా సంస్థలు చదువుతున్న నేపథ్యంలో పుస్తకాలు, నోటుబుక్కులకు అలాగే ట్యూషన్ ఫీజులకు ఎలాంటి ఫీజులు తీసుకోకుండా ఉచితంగా అందించాలని ఆ విద్యాసంస్థకు కోరినట్లు వారు కూడా మానవతా దృక్పథంతో ఒప్పుకున్నారని ఆయన అన్నారు. అలాగే ప్రమోద్ రెండవ కుమారుడు కి కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయంలో తానే సీటు కేటాయించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ప్రమోద్ లేని లోటు ఆయన అన్నారు ఏది ఏమైనా విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్ ను అత్యంత నేరస్తుడైన అయిన రియాజ్ అత్యంత కిరాతకంగా హత్య చేయడం దుర్మార్గమైన చర్యాన్ని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి రియాజ్ లాంటి నేరచరిత్ర కలిగిన వారికి తగిన శిక్ష పడేటట్లు చూడాలన్నారు. అది మరవకముందే హైదరాబాద్లో ఓ డిసిపి పై హత్యాయత్నానికి పాల్పడిన వారిని కూడా గుర్తించి తగు విధంగా శిక్ష విధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత నాలుగు ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోతుందని దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ స్థాయి ఉన్నత పోలీస్ అధికారులు ప్రత్యేక దృష్టి వహించి ప్రజలు స్వేచ్ఛగా సమాజంలో తిరిగేలా చూడాలని ఆయన కోరారు.
మహిళలు, చిన్నారులకు భరోసా... బాధితులకు అండగా జిల్లా భరోసా కేంద్రం
Posted On 2026-07-08 14:21:40
Readmore >
సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు భూమన్న యాదవ్ ను కలిసిన బిక్కనూరు మండల సర్పంచులు
Posted On 2026-07-08 14:18:42
Readmore >
వైరా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం దృష్టికి బహిరంగ విజ్ఞప్తి
Posted On 2026-07-08 07:55:23
Readmore >
ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ హత్య.. కత్తితో భార్య గొంతు కోసిన భర్త
Posted On 2026-07-08 07:13:19
Readmore >
రాజన్న సిరిసిల్ల డబుల్ మర్డర్: భూ వివాదంతో రెండు హత్యలు, నిందితుడికి యావజ్జీవ ఖైదు
Posted On 2026-07-07 14:17:19
Readmore >
ప్రియుడు కోసం మెడపై నుంచి తోసేసి చావకపోతే.. హార్పిక్ ఎక్కించి భర్తను చంపేసిన భార్య
Posted On 2026-07-07 14:04:52
Readmore >
ఆల్ ఇండియా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు ఆల్కలాంబ ని మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ
Posted On 2026-07-07 14:03:47
Readmore >